జిల్లాలకు ఇన్‌చార్జ్‌ మంత్రులను ప్రభుత్వం నియమించింది

విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలన్నీ ఒక్కొక్కటిగా గాడిన పడుతున్నాయి. దీనిలో భాగంగానే 

వివిధ జిల్లాలకు ఇన్‌చార్జ్‌ మంత్రులను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో 13 జిల్లాలకు ఇన్‌చార్జ్‌ మంత్రులను ప్రభుత్వం నియమించింది. పశ్చిమగోదావరి జిల్లాకు ఉప మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ను ఇదే జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా నియమించారు. జిల్లాతో సుభాష్‌ చంద్రబోస్‌కు పరిచయాలు ఉన్నాయి. 

జిల్లా రాజకీయ ముఖ చిత్రంతోపాటు అభివృద్ధి, ప్రణాళికల్లోనూ పూర్తి అవగాహన ఉంది. దీని దృష్ట్యా జిల్లా ఇన్‌చార్జిగా బోస్‌ను నియమించారు.

 జిల్లాలో ఉన్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌కు పశ్చిమ బాధ్యతలు అప్పగించడంతో పాటు కీలక అంశాలను పరిశీలించే బాధ్యతను కూడా పరోక్షంగా ఆయన చేతిలో పెట్టారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా బోస్‌ నియామకం పట్ల శాసన సభ్యులంతా హర్షం ప్రకటించారు.


  
పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మరో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానిని తూర్పుగోదావరి జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా నియమించారు. 

రాజకీయాల్లో ఆరితేరిన నానికి తూర్పుగోదావరి జిల్లా బాధ్యతలు అప్పగించడం విశేషం. గృహ నిర్మాణ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజును విజయనగరం జిల్లా ఇన్‌చార్జిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

 శ్రీకాకుళం-వెల్లంపల్లి శ్రీనివాస్‌, విశాఖ- మోపిదేవి వెంకటరమణ, కృష్ణా జిల్లా-కన్నబాబు, గుంటూరు- పేర్ని నాని, ప్రకాశం-అనిల్‌కుమార్‌ యాదవ్‌, నెల్లూరు-సుచరిత, కర్నూలు- బొత్స సత్యనారాయణ, కడప- బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, 

అనంతపురం-పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు- మేకపాటి గౌతమ్‌రెడ్డి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "జిల్లాలకు ఇన్‌చార్జ్‌ మంత్రులను ప్రభుత్వం నియమించింది"

Post a Comment