ఇక రేషన్ పోర్టబిలిటీ
హైదరాబాద్, జూలై 26: రేషన్ లబ్ధిదారులు, ముఖ్యంగా వలసలు వెళ్లే నిరుపేదలు రేషన్ పొందలేక ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశ్యంతో ప్రజలు రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకునేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం నూతన విధానాన్ని ఆవిష్కరించింది. దీనికి 'రేషన్ పోర్టబిలిటీ' విధానంగా నామకరణం చేశారు. దేశంలో ప్రజలు ఎక్కడి నుంచైనా సరుకులు తీసుకునేలా 'ఒకే దేశం-ఒకే కార్డు' పేరుతో వచ్చే ఏడాది జూన్లోగా దేశ వ్యాప్తంగా అమలుకు కేంద్రం శ్రీకారం చుట్టింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఒక క్లస్టర్, గుజరాత్, మహారాష్ట్ర ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసి ప్రయోగాత్మకంగా ఆగస్టు 1వ తేదీ నుంచి ఈ విధానాన్ని అమలులోకి తెస్తున్నారు
ఆధార్ నంబర్, రేషన్ కార్డుతో అనుసంధానమై ఉండాలి. కొత్త విధానం ప్రకారం ఏపీ, తెలంగాణలో లబ్ధిదారులు ఎక్కడి నుంచైనా రేషన్ సరుకులు తీసుకోవచ్చు. తెలంగాణలో 56 లక్షల మంది లబ్ధిదారులు ఈ సౌకర్యాన్ని పొందనున్నారు. బియ్యం, గోధుమలు, చిరుధాన్యాలను కేంద్రం నిర్దేశించిన మొత్తంలో నిర్ణయించిన ధరల ప్రకారం లబ్ధిదారులకు సరఫరా చేస్తారు. ప్రతి ఒక్కరికి బియ్యం కిలో రూ.3 చొప్పున ఐదు కిలోలు, గోధుమలు కిలో రూ.2కు పంపిణీ చేస్తారు
ఇందులో భాగంగా హైదరాబాద్లోని పంజాగుట్టలోని ఒక రేషన్ షాపులో నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతమైంది. షాప్ నంబర్ 1677750 లో రాజమండ్రికి చెందిన ఈశ్వర్ రావు, విశాఖ జిల్లా యలమంచిలికి చెందిన అప్పారావు అనే లబ్ధిదారులు సరుకులు తీసుకున్నారు. పోర్టబిలిటీ ట్రయల్ రన్ విజయవంతం కావడం వల్ల పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ సం తోషం వ్యక్తం చేశారు. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.
రాష్ట్రంలో 2.82 కోట్ల మంది లబ్థిదారులు సులభంగా రాష్ట్రంలో ఎక్కడి నుంచె నా, ఏ రేషన్ షాపు నుంచైనా సరుకులు తీసుకునే విధంగా పోర్టబిలిటీ విధానాన్ని గత ఏడాది ఏప్రిల్ ఒకటవ తేదీన రాష్టవ్య్రాప్తంగా అమలులోకి తెచ్చా రు. ఈ విధానాన్ని ఇంతవరకు 2.07 కోట్ల మంది వినియోగించుకున్నారు. ఇందులో అత్యధికంగా హైదరాబాద్లో 42 లక్షలు, మేడ్చెల్లో 29లక్షలు, రంగారెడ్డిలో 18 లక్షలు, నిజామాబాద్లో 10 లక్షలు, వరంగల్లో 9లక్షలు మంది కార్డు నదారులు పోర్టబిలిటీ ద్వారా రేషన్ సరుకులను తీసుకున్నారు. కేంద్ర ఆహార భద్రత పరిధిలో ఉన్న లమ్ధిదారులకు మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది.
రాష్ట్రంలో 2.82 కోట్ల మంది లబ్థిదారులు సులభంగా రాష్ట్రంలో ఎక్కడి నుంచె నా, ఏ రేషన్ షాపు నుంచైనా సరుకులు తీసుకునే విధంగా పోర్టబిలిటీ విధానాన్ని గత ఏడాది ఏప్రిల్ ఒకటవ తేదీన రాష్టవ్య్రాప్తంగా అమలులోకి తెచ్చా రు. ఈ విధానాన్ని ఇంతవరకు 2.07 కోట్ల మంది వినియోగించుకున్నారు. ఇందులో అత్యధికంగా హైదరాబాద్లో 42 లక్షలు, మేడ్చెల్లో 29లక్షలు, రంగారెడ్డిలో 18 లక్షలు, నిజామాబాద్లో 10 లక్షలు, వరంగల్లో 9లక్షలు మంది కార్డు నదారులు పోర్టబిలిటీ ద్వారా రేషన్ సరుకులను తీసుకున్నారు. కేంద్ర ఆహార భద్రత పరిధిలో ఉన్న లమ్ధిదారులకు మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది.
ఆధార్ నంబర్, రేషన్ కార్డుతో అనుసంధానమై ఉండాలి. కొత్త విధానం ప్రకారం ఏపీ, తెలంగాణలో లబ్ధిదారులు ఎక్కడి నుంచైనా రేషన్ సరుకులు తీసుకోవచ్చు. తెలంగాణలో 56 లక్షల మంది లబ్ధిదారులు ఈ సౌకర్యాన్ని పొందనున్నారు. బియ్యం, గోధుమలు, చిరుధాన్యాలను కేంద్రం నిర్దేశించిన మొత్తంలో నిర్ణయించిన ధరల ప్రకారం లబ్ధిదారులకు సరఫరా చేస్తారు. ప్రతి ఒక్కరికి బియ్యం కిలో రూ.3 చొప్పున ఐదు కిలోలు, గోధుమలు కిలో రూ.2కు పంపిణీ చేస్తారు
0 Response to "ఇక రేషన్ పోర్టబిలిటీ"
Post a Comment