పాఠశాల విద్యపై నిర్లక్ష్యం

న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌లో విద్యా రంగానికి రూ.95 వేల కోట్లు కేటాయించారు. పాఠశాల విద్య కోసం రూ. 56,536.63 కోట్లు కేటాయించగా.. ఉన్నత విద్యకు రూ.38,317 కోట్ల కేటాయింపులు జరిపారు. విద్యారంగానికి మార్గదర్శకాలను ప్రకటించకుండా.. నూతన విద్యా విధానం, రీసెర్చ్‌ ఫండ్‌, నైపుణ్య అభివృద్ధి లాంటి ప్రణాళికలను చర్చించారు. 



పాఠశాలల విద్యపై మౌనం వహించారు. ప్రాథమిక, సెకండరీ విద్యపై శ్రద్ధ తీసుకోకుండా.. ఉన్నత విద్యను మెరుగుపరచలేమని నిపుణులు విమర్శిస్తున్నారు. ఉపాధ్యాయ శిక్షణ, వయోజన విద్య లాంటి అంశాలకు కేటాయింపుల్లేవు. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే.. 


పాఠశాల విద్య కేటాయింపు లు 6.2 శాతం, ఉన్నత విద్య 0.4 శాతం పెరిగాయి. పరిశోధనలను ప్రోత్సహించ డం, విదేశీ విద్యార్థులు మన దేశంలో చదువుకునే స్థాయిలో ప్రపంచ శ్రేణి విద్యాసంస్థల ఏర్పాటు, క్రీడా సంస్కృతిని పెంపొందించే 'ఖేలో ఇండియా పథకా'లను మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రముఖంగా ప్రస్తావించారు



భారత ఉన్నత విద్యను ప్రపంచంలో మేటిగా రూపొందించేందుకు జాతీయ నూతన విద్యా విధానాన్ని అమలు చేయనున్నట్టు తెలిపారు.



ఈ విధానంతో పాఠశాల, ఉన్నత విద్యలో భారీ మార్పులు వస్తాయని చెప్పారు. పరిశోధనలను ప్రోత్సహించేం దుకు నేషనల్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. 


మన దేశంలో విద్యనభ్యసించేందుకు విదేశీ విద్యార్థులను ప్రోత్సహించేలా ప్రపంచశ్రేణి విద్యా సంస్థలను నిర్మించేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 400 కోట్లను కేటాయిస్తున్నట్టు తెలిపారు.విదేశీ విద్యార్థులనుద్దేశించిన 'స్టడీ ఇన్‌ ఇండియా' పథకం కింద ఈ నిధులను కేటాయిస్తున్నట్టు వివరించారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పాఠశాల విద్యపై నిర్లక్ష్యం"

Post a Comment