కేంద్ర బడ్జెట్ 2019-20 ముఖ్యాంశాలు!
*గృహరుణాలపై మధ్యతరగతికి ఊరట*
దిల్లీ: మధ్య తరగతి ప్రజల గృహ రుణాలపై మరికాస్త ఊరటనిస్తూ కేంద్ర బడ్జెట్లో కీలక ప్రకటన చేశారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసేవారికి ప్రోత్సాహకాలు కల్పించారు. రూ.45 లక్షల లోపు గృహ రుణాలపై వడ్డీ రాయితీని పెంచారు. ప్రస్తుతం గృహ రుణాలపై రూ. 2 లక్షల వరకు వడ్డీ రాయితీ ఉండగా.. దాన్ని రూ. 3.50 లక్షల వరకు పెంచుతున్నట్లు సీతారామన్ వెల్లడించారు
సాక్షి, న్యూఢిల్లీ : భారత్ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రదాన లక్ష్యమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. గత పదేళ్లలో చేపట్టిన ప్రాజెక్టుల సత్వర పూర్తికి కృషి చేస్తామన్నారు.
పార్లమెంట్లో శుక్రవారం కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడుతూ మేకిన్ ఇండియాను మరింత మెరుగుపరుస్తామని ఆమె చెప్పారు. భారత్ను మరింత ఉన్నత స్ధాయికి తీసుకెళ్లడమే లక్ష్యమని తెలిపారు. కాలుష్య రహిత భారత్గా దేశాన్ని రూపొందిస్తామని అన్నారు.ఇన్ఫ్రా, డిజిటల్ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు అవసరమని అన్నారు. 2014-19 మధ్య ఆర్థిక క్రమశిక్షణకు కట్టుబడి ఉన్నామని తెలిపారు
న్యూఢిల్లీః కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2019-20 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను పార్లమెంటులో ఈరోజు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నిర్మల మాట్లాడుతూ.. రైల్వే శాఖలో ఏటా కోట్ల పెట్టుబడుల అవసరం ఉందని తెలిపారు. దేశమంతటా మెరుగైన విద్యుత్ సేవల కోసం 'ఒకే దేశం-ఒకే గ్రిడ్' విధానం తీసుకొచ్చామని వెల్లడించారు.
దీంతో విద్యుత్ ధరలు తగ్గాయని చెప్పారు. దేశంలో అన్నివర్గాల ప్రజలు మోదీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారని సీతారామన్ అన్నారు. నష్టాల్లో కూరుకుపోయిన విద్యుత్ డిస్కంలను రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఆదుకునేందుకు 'ఉదయ్'ను తీసుకొచ్చామని చెప్పారు.
విమానాల ఫైనాన్సింగ్ విషయంలో దృష్టి సారిస్తామని పేర్కొన్నారు
2019-20 బడ్జెట్ హైలెట్స్..
- దేశవ్యాప్తంగా ఏకీకృత రవాణా వ్యవస్థ కోసం ప్రత్యేక విధానం
- విద్యుత్ వాహనాలకు ప్రత్యేక రాయితీలు
- 'జల్ వికాస్ మార్గ్' పథకం ద్వారా అంతర్గత జలరవాణాకు అధిక ప్రాధాన్యత
- 3 కోట్ల మంది రిటైల్ వర్తకులకు పెన్షన్ కోసం 'ప్రధాన మంత్రి కరమ్ యోగి మాన్ ధన్ పథకం'
- ఏటా వార్షికాదాయం రూ.1.5 కోట్లలోపు ఉన్న వ్యాపారులు ఇందుకు అర్హులు
- ఈ పథకం కోసం ఆధార్, బ్యాంకు అకౌంట్ ఉంటే చాలు
- లిస్టెడ్ కంపెనీల్లో ప్రజల వాటా పెంచేందుకు నిర్ణయం
- ఇందుకోసం సెబీతో చర్చించిన కేంద్రం, కేవైసీ నిబంధనలు సులభతరం చేయాలని సూచన
- సెబీ పర్యవేక్షణలో సోషల్ స్టాక్ ఎక్ఛ్సేంజ్ ఏర్పాటు
- సామాజిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు పెట్టుబడులు(ఈక్విటీ, అప్పు, మ్యూచువల్ ఫండ్) సమీకరించేలా త్వరలో నిబంధనలు
0 Response to "కేంద్ర బడ్జెట్ 2019-20 ముఖ్యాంశాలు!"
Post a Comment