అమ్మఒడి పథకం ప్రభుత్వ పాఠశాలలకే.. స్పష్టం చేసిన ఆర్థిక మంత్రి పూర్తి వివరాలు...

ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన 
ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి బ్యూరో 
అమ్మఒడి పథకంపై రాష్ట్రప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఈ పథకాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకే ప్రస్తుతం వర్తింపజేస్తామని ఆర్థిక శాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌ రెడ్డి స్పష్టం చేశారు. 


పిల్లలను బడికి పంపితే తల్లిదండ్రులకు ప్రతి ఏటా రూ.15వేలు ఇస్తామని రాష్ట్రప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటివరకూ ఈ పథకం ఎవరికి వర్తిస్తుందనే స్పష్టత లేకపోవడంతో గందరగోళం నెలకొంది. ప్రైవేట్‌ పాఠశాలలకు కూడా ఈ పథకం వర్తింపజేస్తే ప్రభుత్వ పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని విద్యావేత్తలు, ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు

దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకే వర్తింపజేస్తామని మంత్రి బుగ్గన స్పష్టత ఇచ్చారు. కర్నూలు జిల్లా పరిషత్‌ సమావేశానికి హాజరైన ఆయన ఎలక్ట్రానిక్‌ మీడియాతో మాట్లా డారు. అమ్మ ఒడి పథకం ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ, తెల్లరేషన్‌ కార్డు కలిగివున్న విద్యార్థులకు వర్తిస్తుందని తెలిపారు




. మిగిలిన పాఠశాలల్లో చదివే విద్యార్థులకు వర్తింపజేసే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "అమ్మఒడి పథకం ప్రభుత్వ పాఠశాలలకే.. స్పష్టం చేసిన ఆర్థిక మంత్రి పూర్తి వివరాలు..."

Post a Comment