పేరు ఏదైనా.. పెన్షనే ముఖ్యం

🔳పేరు ఏదైనా.. పెన్షనే ముఖ్యం

10-06-2019 03:45:03


సకల ఉద్యోగ వర్గాల మూకుమ్మడి డిమాండ్‌ కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌) రద్దు! పద్మవ్యూహంలా భావించే సీపీఎస్‌ నుంచి బయటపడటం ఎలా? దీనిపై ఏం చేయాలి? ఈ ప్రశ్నలకు నిపుణుల కమిటీ సమాధానాలు ఇచ్చింది. మాజీ సీఎస్‌ టక్కర్‌ నేతృత్వంలో గత ప్రభుత్వం నియమించిన కమిటీ తన నివేదికను సిద్ధం చేసింది. సోమవారం కొత్త ప్రభుత్వ తొలి కేబినెట్‌భేటీలోనే ఇది చర్చకు రానుంది.ఈ నేపథ్యంలో సీపీఎ్‌సపై నిపుణుల కమిటీ నివేదికలోని కీలకాంశాలతో ‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న ప్రత్యేక కథనమిది!

 

మళ్లీ ఓపీఎ్‌సకు వెళ్లాలి...లేదా తత్సమాన ప్రయోజనాలు ఇవ్వాలి

సీపీఎ్‌సపై నిపుణుల కమిటీ స్పష్టీకరణ

రద్దు... కొనసాగింపు ప్రభుత్వ ఇష్టం

స్కీమ్‌ నుంచి బయట పడటం కష్టమే!

అదనపు లబ్ధి చేకూర్చడమే మార్గం

ఇందుకు ప్రభుత్వ వాటా పెంచాలి

పెన్షన్‌ కార్పస్‌ ఫండ్‌ పెట్టాలి

ఎంత భారమైనా కనీస పెన్షన్‌ ఇవ్వాలి

సమస్యల పై కమిటీ వేయాలి

ప్రభుత్వానికి కీలక సూచనలు

నేడు కేబినెట్‌లో సీపీఎస్‌ రద్దుపై చర్చ

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

సీపీఎ్‌సను రద్దు చేయాలా, లేక కొనసాగించాలా అనే నిర్ణయాన్ని నిపుణుల కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికే వదిలేసింది. సీపీఎ్‌సను కొనసాగించడంవల్ల సమీప భవిష్యత్తులో ప్రభుత్వానికి వచ్చే ప్రయోజనమేదీ లేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి రెండు మార్గాలు సూచించింది. ఒకటి... సీపీఎ్‌సను రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానంలోకి వెళ్లడం! రెండు... పాత పెన్షన్‌ విధానం (ఓపీఎ్‌స)లో లభించే ప్రయోజనాలతో సమానంగా, లేదా ఇంచుమించు అదే స్థాయిలో సీపీఎస్‌ ఉద్యోగులకూ

ప్రయోజనాలు కల్పించాలి. ఇందుకోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించేలా చట్టాలు సవరించాలని కమిటీ సూచించింది. దీనికోసం... ప్రభుత్వం తన కంట్రిబ్యూషన్‌ పెంచాల్సి ఉంటుంది. లేదా కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేయాలి. ఈ రెండు ప్రతిపాదనలను పరిశీలించవచ్చునని నిపుణుల కమిటీ పేర్కొంది.

 

బయటపడటం కష్టమే!

సీపీఎస్‌ నుంచి బయటికి రావడం కష్టమేనని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. పీఎ్‌ఫఆర్‌డీఏ చట్టంతోపాటు ఈ చట్టం అమలుకు కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వాలు కుదుర్చుకున్న ఒప్పందాల నుంచి బయటకు వచ్చేందుకు ఎలాంటి అవకాశం లేదని తెలిపింది. ఒకవేళ బయటకు రావాలని నిర్ణయించుకున్నప్పటికీ... నిధుల విత్‌డ్రాలో అనూహ్యమైన, అవాంఛనీయ సమస్యలు ఎదురవుతాయని తెలిపింది. జాతీయ పెన్షన్‌ పథకం (ఎన్‌పీఎస్‌) ట్రస్టు కమిటీ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసిందని గుర్తు చేసింది. సీపీఎ్‌స రద్దు కుదరని పక్షంలో... ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానంతో సమానమైన ప్రయోజనాలను ప్రభుత్వమే కల్పించే ‘ఆప్షన్‌-బి’ని పరిశీలించాలని కమిటీ సూచించింది. ‘‘దీని అమలులో ఎదురయ్యే ఆర్థిక, చట్టపరమైన చిక్కులు, అవాంతరాలను ముందుగానే గుర్తించాలి. వాటికి పరిష్కారాన్ని సూచించేందుకు ఆర్థిక శాఖలో ఒక కమిటీ ఏర్పాటు చేయాలి. ఈ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా ఉండాలి. ఆర్థిక శాఖ కార్యదర్శి మెంబర్‌ కన్వీనర్‌గా వ్యవహరించాలి. న్యాయశాఖ సెక్రటరీ, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సభ్యులుగా ఉండాలి’’ అని నిపుణుల కమిటీ పేర్కొంది.

 

ప్రత్యేక కమిటీ బాధ్యతలు

ఒకవేళ సీపీఎస్‌ నుంచి పాత పెన్షన్‌ విధానానికి(ఓపీఎస్‌) వెళ్లాలని నిర్ణయించుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురయ్యే ఆర్థిక, చట్టపరమైన చిక్కులు, సమస్యలపై ముందే సూచనలు చేయాలి. సీపీఎస్‌ ఉద్యోగులకు ఓపీఎస్‌స్థాయిలో ప్రభుత్వ వాటా పెంచే పక్షంలో ఎదురయ్యే చిక్కులను ముందే ఊహించి తగిన సూచనలు చేయాలి. బడ్జెట్‌లో నిధులు కేటాయించడం ద్వారా తలెత్తే ఇబ్బందులు, వాటి పరిష్కారాలు సూచించాలి. కుటుంబ పెన్షన్లు, ఇతర అంశాలకు సంబంధించి జీవోల్లో చేయాల్సిన సవరణలు తెలియజెప్పాలి. సీపీఎస్‌ ఉద్యోగుల సంక్షేమానికి కాలానుగుణంగా తీసుకోవాల్సిన చర్యలు సూచించాలి.

ప్రభుత్వం ఏం చేయాలి?

 ఉద్యోగుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసే నిధిని చట్టబద్ధం చేయాలి. చాలా తక్కువ పెన్షన్‌ అందుకునే ఉద్యోగులను అసాధారణ కేసులుగా పరిగణించి వారి సామాజిక భద్రత కోసం కనీస పెన్షన్‌ అందజేసేలా చర్యలు తీసుకోవాలి.

2030 నుంచి సీపీఎస్‌ ఉద్యోగులకు పెన్షన్‌ ఇచ్చేందుకు వీలుగా బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలి.

 పెన్షన్‌ కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేయాలి. నియామకాల్లో, డీఏలో, పీఆర్సీలో వృద్ధి ఆధారంగా పెన్షన్‌ ఫండ్‌కు నిధులు కేటాయించాలి. సీపీఎస్‌ ఉద్యోగులను కూడా స్కీమ్‌ పరిధిలోకి తీసుకురావాలి.

సీపీఎస్‌ ఉద్యోగులకు గృహ, విద్యా రుణాలను తక్కువ వడ్డీకి అందజేయాలి. సీపీఎస్‌ ఉద్యోగులకు కూడా ట్రెజరీ ద్వారానే పెన్షన్లు అందజేయాలి.

యాన్యుటీ పెన్షన్‌ను ఉద్యోగి భాగస్వామికి, కుటుంబానికి కూడా కొనసాగించాలి. దురదృష్టవశాత్తూ ఉద్యోగి ఎవరైనా మరణిస్తే, ఆ ఉద్యోగికి సంబంధించి జమ అయిన మొత్తం పెన్షన్‌లో ఉద్యోగి వాటాను వడ్డీతో సహా వారసులకు అందజేయాలి.

సీపీఎస్‌, ఓపీఎస్‌ ఉద్యోగుల పెన్షన్ల పరిష్కారం కోసం, వివిధ రకాల పెన్షన్ల నిర్వహణకు ఆర్థిక శాఖలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలి.

ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు కేంద్ర, ఇతర రాష్ట్రాలు పరస్పర సహకారం అందించుకోవాలి.

అసాధారణ కేసులను చర్చించి కనీస పెన్షన్‌ అందజేసేలా చర్యలు తీసుకోవాలి.

ఇప్పట్లో ఒరిగేదేమీ లేదు!

సీపీఎ్‌సను కొనసాగించడం వల్ల సమీప భవిష్యత్తులో ప్రభుత్వానికి వచ్చే ప్రయోజనమేదీ లేదని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. సీపీఎస్‌ వల్ల 2040 తర్వాత నుంచే ప్రభుత్వంపై పెన్షన్ల భారం తగ్గడం మొదలవుతుందని వివరించింది. అదే సమయంలో... పాత పెన్షన్‌ విధానం అమలు లేదా సీపీఎ్‌సలో ఉద్యోగులకు అదనపు ప్రయోజనాలు కల్పించడం వల్ల పెన్షన్‌ బిల్లు భారీగా పెరుగుతుందని, ఆర్థిక భారం పెరుగుతుందని గణాంకాలతో సహా వివరించింది. ‘‘పదేళ్లలో పెన్షన్‌ బిల్లులు భారీగా పెరిగాయి. గత మూడేళ్లకు సంబంధించి పాత పెన్షన్‌ విధానం గణాంకాలు, సీపీఎస్‌ గణాంకాలు పరిశీలిస్తే గణనీయమైన తేడా ఉంది. సీపీఎస్‌ వల్ల ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం తగ్గుతుంది’’ అని వివరించింది.

 

ఇతర రాష్ట్రాల్లో ఇదీ పరిస్థితి

తమిళనాడు, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాలు కేంద్రం కంటే ముందుగానే నూతన పెన్షన్‌ విధానం అమలు చేస్తుండగా, పశ్చిమ బెంగాల్‌ మాత్రం పాత విధానాన్ని అమలు చేస్తోంది. త్రిపురలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీపీఎస్‌ను అమల్లోకి తెచ్చారు. మిగతా అన్ని రాష్ట్రాలు ఈ విధానాన్ని అమలుచేస్తూ ఎన్‌పీఎస్‌ ట్రస్టులో చేరాయి. తమిళనాడులో ముందునుంచి సీపీఎస్‌ అమలు చేస్తున్నా ఎన్‌పీఎస్‌ ట్రస్టులో చేరని కారణంగా పెన్షన్‌ నిధిని తమవద్దే ఉంచుకుంది. ఉద్యోగ సంఘాల నిరసనలతో పాత విధానం కొనసాగించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలనకు ఆ రాష్ట్ర ప్రభుత్వం హైపవర్‌ కమిటీని ఏర్పాటుచేసింది. కానీ దానిపై పురోగతి లేదు. కేరళ కూడా ఈ పథకం నుంచి బయటకు రావాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంది. దానికోసం ఆ రాష్ట్ర ప్రభుత్వమూ కమిటీని ఏర్పాటు చేసింది. రాజస్థాన్‌, ఛత్తీస్‌గడ్‌, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాలు పాత విధానమే కావాలని కేంద్రానికి లేఖలు రాశాయి. ఏపీలోనూ ఉద్యోగ సంఘాలు సీపీఎస్‌ రద్దుకు డిమాండ్‌ చేస్తున్నాయి.

 

లోపభూయిష్టంగా చట్టాలు

సాధారణంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించే చట్టాలు పటిష్ఠంగా ఉంటాయని, కానీ సీపీఎస్‌ విధానంపై చేసిన చట్టం మాత్రం లోపభూయిష్టంగా ఉందని న్యాయనిపుణులు సైతం అంగీకరిస్తున్నారు. ఎన్‌ఎస్‌డీఎల్‌తో ఎంఓయూ చేసుకోవడం ద్వారా ఏ రాష్ట్రమైనా ఈ పథకంలో చేరవచ్చు. అయితే ఒకసారి ఎంఓయూ చేసుకున్న తర్వాత దీనినుంచి నుంచి బయటకు రావడానికి చట్టంలో ఎలాంటి అవకాశం లేదు. పార్లమెంటులో సవరణలు చేపట్టడం ద్వారానే ఈ వెసులుబాటు కల్పించవచ్చు. ఎంఓయూ ఉపసంహరణకు కచ్చితంగా చట్ట సవరణ చేయాల్సిందేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ పథకంలో చేరిన ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎక్కువమంది వామపక్ష అనుబంధ సంఘాల్లో ఉన్నారు. ప్రస్తుతం ఆ పార్టీల ప్రతినిధులు చట్టసభల్లో అంతంత మాత్రంగా ఉండటంతో సీపీఎస్‌ రద్దు అంశంలో కేంద్రం స్పందనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

ఉద్యోగులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే...

గతంలో పెన్షన్‌ కోసం ఉద్యోగి జీతం కట్‌ చేసేవారు కాదు. ఇప్పుడు 10శాతం కోత పెడుతున్నారు. మరో 10శాతం ప్రభుత్వం ఇస్తుంది.

పాత విధానంలో పెన్షన్‌కు గ్యారెంటీ ఉండేది. పదవీవిరమణకు ముందు ఉద్యోగి జీతం ఆధారంగా పెన్షన్‌ ఖరారు చేసేవారు. కొత్త విధానంలో ఈ భరోసా ఉండదు. స్టాక్‌ మార్కెట్‌ పెరిగితే పెన్షన్‌ పెరుగుతుంది. కుప్పకూలితే అదీ కరిగిపోతుంది.

కొత్త విధానంలో గ్రాట్యుటీ, కుటుంబ పెన్షన్‌ అందదు. ఉద్యోగి మరణిస్తే షేర్‌మార్కెట్లో ఉన్న సొమ్ము మొత్తం ఆ కుటుంబానికి చెల్లిస్తారు. తర్వాత ఎలాంటి పెన్షన్‌ రాదు. దీనిలో కమ్యూటేషన్‌ సౌకర్యం లేదు.

సీపీఎస్‌ ఉద్యోగులకు పీఎఫ్‌ ఖాతా ఉండదు. వాణిజ్య బ్యాంకుల్లో నగదు దాచుకుంటే వడ్డీపై ఐటీ చెల్లించాలి.

ఈ పథకం కింద మదుపు చేసిన మొత్తంపై అప్పు తీసుకునే అవకాశం ఉండదు.


🔳సిపిఎస్‌ రద్దు చెయ్యొచ్చు!

Posted On: Monday,June 10,2019


- విచక్షణాధికారం రాష్ట్ర సర్కారుదే!

- లేకపోతే ఒపిఎస్‌తో సమానమైన లబ్ది చేకూర్చాలి

- ప్రభుత్వానికి టక్కర్‌ కమిటీ నివేదిక

- నేడు మంత్రివర్గంలో చర్చ

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి

                             కంట్రిబ్యూటరీ పింఛను విధానాన్ని రద్దు చేసే విచక్షణాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉరదని నిపుణుల కమిటీ తేల్చి చెప్పిరది. మాజీ సిఎస్‌ ఎస్‌పి టక్కర్‌ నేతృత్వంలో ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీ ప్రభుత్వానికి 141 పేజీల నివేదికను సమర్పిరచిరది. సిపిఎస్‌ను రద్దు చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెబుతూనే రెరడు ఆప్షన్లను కూడా ప్రభుత్వం మురదు ఉరచిరది. అలాగే తన నివేదికలో ఓపిఎస్‌లో ఉద్యోగులు పొరదుతున్న లబ్దిలో నాలుగో వంతు (25శాతం) మేరకే సిపిఎస్‌ ఉద్యోగులు పొరదుతున్నారని నిగ్గు తేల్చిరది. వాస్తవానికి ప్రభుత్వం భరిస్తున్న 10 శాతం వాటా మేరకు సిపిఎస్‌ ఉద్యోగులకు 25 శాతం మేలు కలుగుతోరదని, దీనిని 20 శాతానికి పెరచినా మొత్తం లబ్ది 50 శాతం వరకే ఉరటురదని కమిటీ అభిప్రాయపడిరది. ఈ నివేదిక ఆధారంగానే సోమవారం జరిగే తొలి మంత్రివర్గ సమావేశంలో దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమరత్రి జగన్మోహన్‌రెడ్డి భావిస్తున్నారు. అజెరడాలో కూడా దీనిని ప్రతిపాదిరచారు. 

1990 దశకంలో నెలకొన్న ఆర్ధిక పరిస్థితుల నేపథ్యంలో నూతన ఆర్థిక సంస్కరణల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం సిపిఎస్‌ను తెరపైకి తీసుకువచ్చింది. దీనిని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆమోదిరచి అమలు చేయడం ప్రారంభిరచాయి. పశ్చిమ బెరగాల్‌, ఢిల్లీల్లో ఈ విధానాన్ని ఆమోదిరచలేదు. కేరళలో ఆనాటి ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం తిరస్కరించినా ఆ తరువాత వచ్చిన యుడిఎఫ్‌ సర్కారు సిపిఎస్‌ను అమలు చేసింది. త్రిపుర మాత్రం గత ఏడాది సిపిఎస్‌కు ఆమోదాన్ని తెలిపిరది. అయితే మన రాష్ట్రంలో మాత్రం ఈ విధానం 2004 నుండి కొనసాగుతున్నప్పటికీ కొన్నేళ్లుగా దీనిని రద్దు చేయాలంటూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆరదోళనలు చేస్తున్నారు. ఆ ఒత్తిడితోనే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటుచేసిన టక్కర్‌ కమిటీ తన నివేదికను కొత్త ప్రభుత్వానికి అరదచేసిరది. దీనిపైనే సోమవారం నాటి మంత్రివర్గంలో చర్చిరచనున్నారు. కమిటీ తన నివేదికలో అనేక అరశాలను, రాష్ట్ర, దేశంలో నెలకొన్న పరిస్థితులను వివరిస్తూనే కొన్ని సూచనలు చేసిరది. కేంద్రం పెట్టిన విధానమే అయినప్పటికీ దానిని వద్దనుకునే అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయని తేల్చి చెప్పిరది. అలాగే రెరడు ఆప్షన్లు సూచిరచిరది. సిపిఎస్‌ను పూర్తిగా రద్దు చేసి, పాత పింఛన్‌ విధానాన్ని అమలు చేయడం ఒక ఆప్షన్‌ కాగా, సిపిఎస్‌ను కొనసాగిస్తూనే ఓపిఎస్‌లో అరదుతున్న లబ్దికి సమానమైన రీతిలో సిపిఎస్‌లోని వారికి కూడా వర్తిరపచేయడం ఇరకో ఆప్షన్‌గా పేర్కొరది.ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఇతర వర్గాల నురచి సేకరిరచిన సమాచారం మేరకు సిపిఎస్‌ వల్ల లాభనష్టాలను కూడా నివేదికలో పొరదుపరిచిరది. సిపిఎస్‌ రద్దు చేస్తూ ఉద్యోగుల పేరున ఏటా రూ.600 నురచి 700 కోట్లు వారి జిపిఎఫ్‌ ఖాతాల్లో జమ చేస్తే అత్యవసర పరిస్థితుల్లో ఈ నగదును ఉపయోగిరచుకునే అవకాశం ప్రభుత్వానికి ఉరటురదని కమిటీ పేర్కొరది. అలాగే ప్రస్తుతం సిపిఎస్‌ పరిధిలో ఉన్న ఉద్యోగులకు తక్షణమే పింఛను ఇవ్వాల్సిన అవసరం కూడా ఉరడదని స్పష్టం చేసిరది. సిపిఎస్‌ కొనసాగిరచినా కూడా 2040 సంవత్సరం నాటికి మాత్రమే పింఛను భారం ఉరటురదని, అరదువల్ల ఇప్పట్లో ప్రభుత్వానికి వచ్చే లాభ నష్టాలు ఏమీ లేవని పేర్కొరది.

కాగా, ప్రస్తుతం ఉన్న సిపిఎస్‌ విధానాన్ని సరళీకృతం చేస్తూ గతంలో ఉన్న పాత పింఛను విధానానికి సమానంగా లబ్ది కల్పిరచే ప్రయత్నం చేయాలని తన రెరడో సూచనగా కమిటీ ప్రభుత్వానికి నివేదిరచిరది. స్వల్ప కాలిక చర్యలో భాగంగా ప్రభుత్వ వాటాను ప్రస్తుతం వున్న పది శాతానికి అదనంగా నాలుగు నురచి పది శాతం వరకు పెరచాలని సూచించింది. ఇప్పటికే కేంద్రం పది శాతం నురచి 14 శాతానికి పెరచిన వైనాన్ని కమిటీ తన నివేదికలో ప్రస్తావిరచిరది. అలాగే సిఎస్‌ అధ్యక్షతన పింఛను నిధి నిర్వహణ విభాగాన్ని ఏర్పాటుచేయాలని, ప్రతి ఉద్యోగికి కనీస మొత్తం అరదేలా ప్రణాళిక రూపొరదిరచాలని, సిపిఎస్‌ నురచి ఓపిఎస్‌కు మార్చే సమయంలో వచ్చే న్యాయ అడ్డరకులను అధిగమిరచేరదుకు మురదుగానే ఆలోచన చేయాలని, అవసరమైతే చట్ట సవరణ చేయాలని సూచిరచిరది. ఇక దీర్ఘకాలికంగా తీసుకోవాల్సిన చర్యలపైనా కమిటీ కొన్ని సిఫార్సులు చేసిరది. ఓపిఎస్‌ ఉద్యోగులకు ఇస్తున్న పిరఛనుకు సమానంగా లేదా దగ్గరగా సిపిఎస్‌ ఉద్యోగులకు లబ్ది కల్పిరచేరదుకు అవసరమైన బడ్జెట్‌ కేటాయిరపులు చేయాల్సి ఉరటురదని, అది కూడా 2030 తరువాతే అవసరమవుతురదని కమిటీ పేర్కొరది. అవసరం మేరకు పెన్షన్‌ కార్పస్‌ ఫండ్‌ను బడ్జెట్‌లో కేటాయిరచాలని సూచిరచిరది. సిపిఎస్‌ ఉద్యోగులకు కూడా ఆరోగ్య పథకాన్ని వర్తిరపజేయాలని, ఇళ్లు, విద్య వంటి అరశాల్లో రుణ సౌకర్యాన్ని కల్పిరచాలని, ఉద్యోగి తరువాత అతని భార్య, కుటుంబ సభ్యులకు పింఛను సౌకర్యం విస్తరిరచాలన్న సూచనలతోపాటు మరికొన్ని సూచనలు చేసిరది. వీటిపై సోమవారం మంత్రివర్గంలో చర్చిరచను న్నారు. ఏ నిర్ణయం తీసుకురటారో వేచి చూడాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పేరు ఏదైనా.. పెన్షనే ముఖ్యం"

Post a Comment