ఏపీలో వాలంటీర్లకు అర్హతపై కేబినెట్ నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మార్క్ నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు సాగుతోన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన నవరత్నాలు హామీని నెరవేర్చేందుకు గట్టిగా నిర్ణయించుకున్న జగన్.. ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ను నియమించే విషయంపై తొలి కేబినేట్లో నిర్ణయం తీసుకున్నారు.
CLICK HERE TO SEE VIDEO CABINET DESISSIONNS
గ్రామాల్లో ఉండే యువతీ యువకులకు ఉపాధి కల్పించడంలో భాగంగా గ్రామ వాలింటర్లు, పట్టణాల్లో యువతను వార్డు వాలింటర్లగా నియమించేందుకు కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకంలో భాగంగా వాలింటర్లకు అర్హతగా.. పట్టణాల్లో అయితే డిగ్రీ పాస్ అయి ఉండాలి.. గ్రామాల్లో అయితే.. ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి. గిరిజన ప్రాంతాల్లో అయితే 10వ తరగతి పాస్ అయ్యి ఉండాలి అని కేబినెట్ నిర్ణయించింది
ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నట్లుగా ఏపీ మంత్రి పేర్ని నానీ మీడియాకు వెల్లడించారు. ఈ నియామకాలను ఆగస్ట్ 15వ తేదీకి పూర్తి చేసి నియమించాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే వాలంటీర్ పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ap.gov.in వైబ్ సైట్లో జూలై నెలాఖరులోపు దరఖాస్తు చేసుకోవాలి.
మొత్తం 4లక్షల 33వేల 126 వాలంటీర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఆగస్టు 15కు ముందే ఫలితాలు విడుదల చేయనున్నారు. ప్రతి వాలంటీర్కి 5వేల వేతనం ప్రభుత్వం ఇవ్వనుంది
0 Response to "ఏపీలో వాలంటీర్లకు అర్హతపై కేబినెట్ నిర్ణయం"
Post a Comment