ఎపి తొలి కేబినెట్‌లో కీలక నిర్ణయాలు

అమరావతి : ఎపి కేబినెట్‌ భేటీ ముగిసింది. సోమవారం ఉదయం ప్రారంభమైన కేబినెట్‌ సమావేశం దాదాపు అయిదున్నర గంటల పాటు సాగింది. 

ఈ సమావేశంలో ఎపి కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. సామాజిక పెన్షన్లు రూ.2,250 కి పెంచుతూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. 


ఆశావర్కర్ల జీతాలు రూ.3 వేల నుండి రూ.10 వేలకు పెంచుతూ సిఎం జగన్‌ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 


ప్రభుత్వ ఉద్యోగుల ఐఆర్‌ చెల్లింపునకు గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది.


 ఆర్‌టిసి ని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కేబినెట్‌ సుముఖత వ్యక్తం చేసింది. వీలైనంత త్వరగా విలీన ప్రక్రియ ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకుంది. 


వైఎస్‌ఆర్‌ రైతు భరోసా అమలుపై కేబినెట్‌ చర్చ కొనసాగుతోంది

దీనికి సంబంధించి అక్టోబర్‌ 15 నుండి రైతు భరోసా అమలుకు ఏర్పాట్లు చేయాలని సిఎం జగన్‌ సూచించినట్లు సమాచారం

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఎపి తొలి కేబినెట్‌లో కీలక నిర్ణయాలు"

Post a Comment