వాట్సాప్ సంచలన నిర్ణయం
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆండ్రాయిడ్ 2.3.7 ఆపరేటింగ్ సిస్టమ్, ఐవోఎస్ 7 వాడే ఐఫోన్లకు వాట్సాప్ సేవలను నిలిపివేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.
వాట్సాప్ కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం 2020 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమలు కాబోతోంది. పాత ఓఎస్లు ఉన్న ఫోన్లలో కొత్తగా వాట్సాప్ అకౌంట్లు డౌన్లోడ్ చేసుకోలేరని, పాత అకౌంట్లను కూడా వినియోగించలేదని వెల్లడించింది.
'2019 డిసెంబర్ 31 తర్వాత విండోస్ ఓఎస్ ఉన్న యూజర్లు వాట్సాప్ను వాడలేరు. ఈ ఏడాది జూలై 1 నుంచి మైక్రోసాఫ్ట్ స్టోర్లో వాట్సాప్ అందుబాటులో ఉండదు' అని కంపెనీ ప్రకటించింది. కేవలం ఆండ్రాయిడ్ 4.0.3, ఐవోఎస్ 8 అంతకన్నా అప్డేటెడ్ వెర్షన్లు వాడాలని పేర్కొంది.
ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం వాట్సాప్ ప్రత్యేకంగా 2.199.177 బీటా నూతన వెర్షన్ను ఇటీవల విడుదల చేసింది. ఈ వెర్షన్లో వాట్సాప్లో చాటింగ్ చేస్తూ కూడా పీఐపీ మోడ్ వీడియోలను కూడా చూడొచ్చు.
కాగా ఈ వెర్షన్ ఇంకా టెస్టింగ్ స్టేజ్లోనే ఉంది
వాట్సాప్ కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం 2020 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమలు కాబోతోంది. పాత ఓఎస్లు ఉన్న ఫోన్లలో కొత్తగా వాట్సాప్ అకౌంట్లు డౌన్లోడ్ చేసుకోలేరని, పాత అకౌంట్లను కూడా వినియోగించలేదని వెల్లడించింది.
'2019 డిసెంబర్ 31 తర్వాత విండోస్ ఓఎస్ ఉన్న యూజర్లు వాట్సాప్ను వాడలేరు. ఈ ఏడాది జూలై 1 నుంచి మైక్రోసాఫ్ట్ స్టోర్లో వాట్సాప్ అందుబాటులో ఉండదు' అని కంపెనీ ప్రకటించింది. కేవలం ఆండ్రాయిడ్ 4.0.3, ఐవోఎస్ 8 అంతకన్నా అప్డేటెడ్ వెర్షన్లు వాడాలని పేర్కొంది.
ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం వాట్సాప్ ప్రత్యేకంగా 2.199.177 బీటా నూతన వెర్షన్ను ఇటీవల విడుదల చేసింది. ఈ వెర్షన్లో వాట్సాప్లో చాటింగ్ చేస్తూ కూడా పీఐపీ మోడ్ వీడియోలను కూడా చూడొచ్చు.
కాగా ఈ వెర్షన్ ఇంకా టెస్టింగ్ స్టేజ్లోనే ఉంది
0 Response to "వాట్సాప్ సంచలన నిర్ణయం"
Post a Comment