తెలంగాణాలో పదోతరగతి పరీక్ష ఫలితాలు
హైదరాబాద్ : రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను సచివాలయంలోని డీ బ్లాక్లో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి విడుదల చేశారు. ఈ ఏడాది 92.43 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికల ఉత్తీర్ణత శాతం 93.68 కాగా, బాలుర ఉత్తీర్ణత శాతం 91.18 శాతంగా నమోదైంది. టెన్త్ ఫలితాల్లో జగిత్యాల మొదటి స్థానంలో నిలవగా, హైదరాబాద్ చివరి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫలితాలను www.ntnews.com వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
రాష్ట్రంలో దాదాపు 5 లక్షలకు పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.
ఈ ఫలితాలను www.bse.telangana.gov.in వెబ్సైట్ నుంచి పొందాలని సూచించారు. ఫలితాలపై ఫిర్యాదుల కోసం పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ప్రత్యేక యాప్ TSSSCBOARD అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.
వెబ్సైట్లో ప్రత్యేకంగా స్కూల్ లాగిన్ ఏర్పాటు చేశామని, దీని ద్వారా పాఠశాల విద్యార్థుల ఫలితాలు తెలుసుకునేందుకు వీలు కలుగుతుందని చెప్పారు
యాప్ కోసం ఇలా :
* యాప్ను వెబ్సైట్ ద్వారా గానీ, ప్లేస్టోర్లో గానీ 'టీఎస్ఎస్ఎస్సీబోర్డ్ యాప్' అని టైప్చేసి డౌన్లోడ్ చేసుకోవాలి.
* యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక హాల్టికెట్ నంబరు, పుట్టినతేదీ నమోదు చేసి లాగిన్ కావాలి.
* లాగిన్ అయ్యాక విద్యార్థి పేరు, పాఠశాల వివరాలు, హాల్టికెట్ నంబరు కనిపిస్తుంది. ఫిర్యాదు నమోదు చేసేందుకు మొబైల్నెంబరు, ఈ-మెయిల్ ఐడీ నమోదు చేయాలి.
CLICK HERE TO DOWNLOAD RESULTS
* ఫిర్యాదు విభాగంలో ఫిర్యాదు రకాన్ని ఎంచుకుని, ఫిర్యాదును నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
CLICK HERE TO DOWNLOAD RESULTS
* ఫిర్యాదు బోర్డుకు అందిన వెంటనే మొబైల్ నెంబరు, ఈ-మెయిల్ ఐడీకి సమాచారం వస్తుంది. ఫిర్యాదు ఒకేసారి చేయడానికి అవకాశముంటుంది
0 Response to "తెలంగాణాలో పదోతరగతి పరీక్ష ఫలితాలు"
Post a Comment