పది’ మార్కుల పునఃగణన
*✨ 'పది’ మార్కుల పునఃగణన*
★ పదో తరగతి వార్షిక పరీక్షలు రాసిన విద్యార్థులు మార్కుల పునఃగణన, పునఃపరిశీలనకు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 30 వరకు గడువు.
★ పునఃగణన నిమిత్తం ఒక్కో సబ్జెక్టుకు రూ.500,
★ పునఃపరిశీలన నిమిత్తం ఒక్కో సబ్జెక్టుకు రూ.1000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
★ ఈ మొత్తాన్ని సీఎఫ్ఎంఎస్ ద్వారా చలానా రూపంలో చెల్లించాలి.
★ మార్కుల పునఃగణనకు చెల్లించే మొత్తానికి సంబంధించిన చలానాతో పాటు నిర్ణీత దరఖాస్తును నేరుగా ఎస్ఎస్సీ బోర్డుకు పంపాలి.
★ మార్కుల పునఃపరిశీలకు చెల్లించే మొత్తానికి సంబంధించిన చలానాతోపాటు నిర్ణీత దరఖాస్తును డీఈవో కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది.
★ మార్కుల పునఃపరిశీలనకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు పదో తరగతి హాల్ టికెట్ నకలు, మార్కుల జాబితా నకలును దరఖాస్తునకు జత చేయాల్సి ఉంటుంది.
★ వీటితోపాటు విద్యార్థి చదివిన పాఠశాల చిరునామాతో ఒక తపాలా కవరు,
★ విద్యార్థి ఇంటి చిరునామాతో ఒక తపాలా కవరు దరఖాస్తునకు జత చేయాలి.
★ సంబంధిత దరఖాస్తులను ఈక్రింది వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు..
👇🏻👇🏻👇🏻
CLICK HERE TO DOWNLOAD APPLICATION
░▒▒░
0 Response to "పది’ మార్కుల పునఃగణన"
Post a Comment