సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్ష ఫలితాలు మే 20 తర్వాతనే వెల్లడించిన సి బి ఎస్ సి
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10, 12వ తరగతి పరీక్షల ఫలితాలపై కీలక అప్డేట్ వచ్చింది.
ఈ ఫలితాలను మే 20 తర్వాతే వెల్లడించే అవకాశం
ఉన్నట్లు సీబీఎస్ఈ తెలిపింది.
ఫిబ్రవరి-ఏప్రిల్ మధ్యలో జరిగిన ఈ పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థులు ఫలితాల కోసం ఎంతో ఆసక్తితో
ఎదురుచూస్తోన్న వేళ సామాజిక మాధ్యమాల్లో
రిజల్ట్స్కు సంబంధించి ఫేక్ సమాచారం చక్కర్లు
కొడుతోన్న వేళ బోర్డు స్పందించింది.
ఇటీవలే ఆ
నకిలీ సమాచారాన్ని ఖండించిన సీబీఎస్ఈ
అధికారులు.. మే 20 తర్వాతే ఫలితాలు విడుదల
చేయనున్నట్లు పేర్కొన్నారు.
విద్యార్థుల్లో అనారోగ్యకరమైన పోటీని
నివారించేందుకు సీబీఎస్ఈ బోర్డు గత కొన్నేళ్లుగా
మెరిట్ జాబితాలను వెల్లడించకూడదని నిర్ణయించిన
విషయం తెలిసిందే. ఈ ఏడాది సీబీఎస్ఈ పదో
తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి
18వరకు; 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి
ఏప్రిల్ వరకు జరగ్గా... దేశవ్యాప్తంగా దాదాపు
88లక్షల మంది విద్యార్దులు పరీక్ష రాశారు.
0 Response to "సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్ష ఫలితాలు మే 20 తర్వాతనే వెల్లడించిన సి బి ఎస్ సి"
Post a Comment