సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్ష ఫలితాలు మే 20 తర్వాతనే వెల్లడించిన సి బి ఎస్ సి

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (CBSE) 10, 12వ తరగతి పరీక్షల ఫలితాలపై కీలక అప్‌డేట్‌ వచ్చింది.



ఈ ఫలితాలను మే 20 తర్వాతే వెల్లడించే అవకాశం

ఉన్నట్లు సీబీఎస్‌ఈ తెలిపింది.


ఫిబ్రవరి-ఏప్రిల్‌ మధ్యలో జరిగిన ఈ పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థులు ఫలితాల కోసం ఎంతో ఆసక్తితో

ఎదురుచూస్తోన్న వేళ సామాజిక మాధ్యమాల్లో

రిజల్ట్స్‌కు సంబంధించి ఫేక్‌ సమాచారం చక్కర్లు

కొడుతోన్న వేళ బోర్డు స్పందించింది.


ఇటీవలే ఆ

నకిలీ సమాచారాన్ని ఖండించిన సీబీఎస్‌ఈ

అధికారులు.. మే 20 తర్వాతే ఫలితాలు విడుదల

చేయనున్నట్లు పేర్కొన్నారు.


విద్యార్థుల్లో అనారోగ్యకరమైన పోటీని

నివారించేందుకు సీబీఎస్‌ఈ బోర్డు గత కొన్నేళ్లుగా

మెరిట్‌ జాబితాలను వెల్లడించకూడదని నిర్ణయించిన




విషయం తెలిసిందే. ఈ ఏడాది సీబీఎస్‌ఈ పదో

తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి

18వరకు; 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి

ఏప్రిల్‌ వరకు జరగ్గా... దేశవ్యాప్తంగా దాదాపు

88లక్షల మంది విద్యార్దులు పరీక్ష రాశారు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్ష ఫలితాలు మే 20 తర్వాతనే వెల్లడించిన సి బి ఎస్ సి"

Post a Comment