హిందీ,ఆంగ్లం పాస్... సోషల్ ఫెయిల్ బిట్ల కుదింపుతో సబ్జెక్టుల్లో దెబ్బతిన్న పిల్లలు
అమరావతి, జూన్ 7 (ఆంధ్రజ్యోతి) : పదో తరగతి విద్యార్థుల్లో అత్యధికులు సోషల్ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారు. హిందీ, ఇంగ్లీషులో ఉత్తీర్ణులయ్యారు.
హిందీ పరీక్షలో 20 మార్కులొస్తే పాస్ కాబట్టి బాగానే ఉత్తీర్ణులయ్యారు. ఆంగ్లంలో కూడా అత్యధికులు ఉత్తీర్ణత పొందారు. కానీ ఆశ్చర్యకరంగా సోషల్లో ఎక్కువమంది ఫెయిల్ అయ్యారు. సాధారణంగా సోషల్ సబ్జెక్టు తేలిగ్గా ఉంటుంది. అయితే ఈసారి ఎ.బి.సి.డి. ఆప్షన్లు ఇచ్చి పూరించే బిట్లు తగ్గించారు. గతంలో ఈ బిట్లు 30వరకు ఇస్తుండగా, ఈసారి వాటిని 12కే పరిమితం చేశారని
అంటున్నారు. ఈ చాయిస్ బిట్లలో విద్యార్థులకు కాస్త ఎక్కువ మార్కులు వచ్చేవి. ఈసారి ఆ చాయిస్ తగ్గించడంతో వారికి
మార్కులు తగ్గి ఫెయిలయ్యారని అంటున్నారు. ఆ తర్వాత ఇతర సబ్జెక్టులు అంటే మ్యాథ్స్, సైన్స్లో కూడా ఫెయిలైనవారున్నారు. మొత్తంగా చూస్తే లాంగ్వేజె్సలో విద్యార్థులు అత్యధికంగా ఉత్తీర్ణత సాధించగా...సబ్జెక్టుల్లో
ఫెయిలయ్యారు. ఆంగ్లంలో ఉత్తీర్ణత సాధించిన వారిలో ఎక్కువమంది ప్రైవేటు పాఠశాలల విద్యార్థులే ఉన్నారు
0 Response to "హిందీ,ఆంగ్లం పాస్... సోషల్ ఫెయిల్ బిట్ల కుదింపుతో సబ్జెక్టుల్లో దెబ్బతిన్న పిల్లలు"
Post a Comment