వెంటనే డీఏ బకాయిలు ఇవ్వండి:
అమరావతి, జూన్ 24(ఆంధ్రజ్యోతి): జనవరి డీఏ, డీఏ బకాయిలపై ఇప్పటికీ ప్రభుత్వం నుంచి స్పష్టత లేదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. దీంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని,
వెంటనే విడుదల చేయాలని శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. 2018 జూలై 1 నుంచి 2019 జనవరి 1 వరకు డీఏ ఎరియర్స్ ఇప్పటికీ సీపీఎస్, ఓపీఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించలేదన్నారు. 2019 జూలై 1కి సంబంధించిన డీఏ ఎరియర్స్ చెల్లించాలని జీవో ఇచ్చి రద్దు చేశారన్నారు. కరోనా సమయంలో కేంద్రం ఫ్రీజ్ చేసిన 3 డీఏలు ఎరియర్స్తో సహా చెల్లించిందని, కానీ రాష్ట్రం ఇంతవరకు ఆదేశాలు ఇవ్వలేదన్నారు.
2021 జూలై 1 డీఏ ప్రకటించినా ఎరియర్స్ చెల్లింపుల విషయంలో ప్రభు త్వం ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు.
శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఉద్యోగుల డీఏల బకాయిల చెల్లింపులపై నిర్ణయం తీసుకుంటారని ఉద్యోగులు ఎదురు చూశారని, అయితే ఎలాంటి నిర్ణయం వెలువడలేదన్నారు
0 Response to "వెంటనే డీఏ బకాయిలు ఇవ్వండి:"
Post a Comment