‘పది’ ఫలితాలు
అమరావతి, జూన్ 2(ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షల ఫలితాలు శనివారం విడుదల చేయనున్నారు. ఆరోజు ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ ఫలితాలను
విడుదల చేస్తారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరక్టర్ దేవానంద్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సుమారు 6 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశా రు.
గతంలో మాదిరే ఈసారీ విద్యార్థులకు వచ్చిన మార్కులనే వెల్లడిస్తారు. గ్రేడింగ్ పద్ధతిని తీసేశారు. విద్యాశాఖ ర్యాంకులనూ ప్రకటించదు. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలు కూడా తమ దగ్గర చదువుకున్న విద్యార్థులకు ఫలానా ర్యాంకులు వచ్చాయని ప్రచారం చేయకూడదని,
అలా చేస్తే కనీ సం మూడేళ్ల జైలు శిక్ష పడుతుందని ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది
0 Response to " ‘పది’ ఫలితాలు"
Post a Comment