ఇక రాష్ట్రంలో డిజిటల్‌ చదువులు త్వరలోనే విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు: మంత్రి సురేశ్‌



చిలకలూరిపేట, మార్చి 12: రాష్ట్ర విద్యావ్యవస్థలోకి అతి తక్కువ వ్యవధిలోనే డిజిటల్‌ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ చెప్పారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండ లం కొత్తరాజాపేటలో రూ.6 కోట్లతో నిర్మించిన ఏపీ గురుకుల బాలుర పాఠశాల భవనాన్ని శనివారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర  విద్యారంగంలో ఓటీటీలను అందుబాటులోకి తీసుకువచ్చి విద్యాబోధన చేపట్టేలా ఆలోచిస్తున్నామన్నారు. దీనిలో భాగంగా వచ్చే ఏడాది నుంచి అమ్మఒడి ద్వారా 9, 10 తరగతుల పిల్లలకు ల్యాప్‌టా్‌పలు అందిస్తామన్నారు. ఇప్పటికే విద్యావ్యవస్థలో డిజిటల్‌ విప్లవం కొనసాగుతోందన్నారు. మారుతున్న కాలం, విద్యాపద్ధతులకు అనుగుణంగా ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాకు ఒక ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. 2024-25 నాటికి పదో తరగతి వరకు సీబీఎ్‌సఈ సిలబస్‌ బోధన మాత్రమే చేయనున్నట్టు చెప్పారు. ఏపీఆర్‌జేసీకి వచ్చే రెండేళ్లలో పాఠశాల భవనాలు నిర్మిస్తామన్నారు. నాడు-నేడు మొదటి విడతలో 16 వేల పాఠశాలలను రూ.3,600 కోట్లతో తీర్చిదిద్దామని, రెండో విడతలో 15,717 స్కూళ్లను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తెలిపారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఇక రాష్ట్రంలో డిజిటల్‌ చదువులు త్వరలోనే విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు: మంత్రి సురేశ్‌"

Post a Comment