ఏపీలో భారీగా విద్యుత్ చార్జీల పెంపు
అమరావతి: ఏపీలో సామాన్యులపై జగన్ సర్కార్ మరో పిడుగు వేసింది. రాష్ట్రంలో భారీగా విద్యుత్ చార్జీలు పెరిగాయి. పెరిగిన విద్యుత్ టారిఫ్ను బుధవారం ఏపీఈఆర్సీ చైర్మన్ విడుదల చేశారు. ఈ ప్రకారం 30 యూనిట్ల వారికి యూనిట్కు 45 పైసలు పెంచారు. 31 నుంచి 75 యూనిట్ల వారికి యూనిట్కు 95 పైసలు పెంచారు. అలాగే 126 నుంచి 225 యూనిట్ల వారికి యూనిట్కు రూ.1.57 పెంచగా, 226 నుంచి 400 యూనిట్ల వారికి యూనిట్కు రూ.1.16 పెంచారు. 400 యూనిట్లపైన వారికి యూనిట్కు రూ.55 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కేటగిరీలను రద్దు చేసి 6 స్లాబ్లను తీసుకొచ్చినట్లు ఏపీఈఆర్సీ చైర్మన్ వెల్లడించారు
💥 *AP : రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెరిగాయి.*
👉🏽 30 యూనిట్ల వరకు యూనిట్కు 45 పైసలు
👉🏽 31-75 యూనిట్ల వరకు యూనిట్కు 91 పైసలు
👉🏽 76-125 యూనిట్ల వరకు యూనిట్కు రూ.1.40 పెంపు
👉🏽 126-225 యూనిట్ల వరకు యూనిట్కు రూ.1.57 పెంపు
👉🏽 226-400 యూనిట్ల వరకు యూనిట్కు రూ.1.16 పెంపు
👉🏽 400 యూనిట్లు దాటితే యూనిట్కు 55 పైసలు

0 Response to "ఏపీలో భారీగా విద్యుత్ చార్జీల పెంపు"
Post a Comment