టెన్త్‌ పరీక్ష కేంద్రాల ఎంపికకు ఆదేశాలు

(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు అవసరమైన పరీక్షా కేంద్రాల ఎంపికపై ప్రతిపాదనలు పంపించాలని అన్ని జిల్లాల విద్యాశాఖా అధికారులకు ప్రభుత్వ పరీక్షల డైరక్టర్‌ దేవానంద్‌రెడ్డి నిర్దేశించారు. 


ఇంటర్‌ పరీక్షలను వాయిదా వేసిన ప్రభుత్వం కొత్త షెడ్యూలును ప్రకటించింది. ఏప్రిల్‌ 22 నుంచి మే 12 వరకు ఇంటర్‌ పరీక్షలు ఉంటాయని తెలిపింది. 


పదో తరగతి పరీక్షలు కూడా మే నెలలోనే జరగనున్నాయి. దీంతో ఇంటర్‌ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసిన జూనియర్‌ కళాశాలల్లో కాకుండా ఇతర విద్యా సంస్థల్లో పదో తరగతి పరీక్షలకు కేంద్రాలు ఎంపిక చేయాలని గురువారం పంపిన సర్క్యులర్‌లో ఆయన సూచించారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "టెన్త్‌ పరీక్ష కేంద్రాల ఎంపికకు ఆదేశాలు"

Post a Comment