టీచర్లను బెదిరిద్దామనుకుంటే..
టీచర్లను బెదిరిద్దామనుకుంటే..!
విద్యాశాఖకు తలనొప్పిగా టోల్ ఫ్రీ నంబర్.. విలీనంపై ఫిర్యాదులు
కుప్పం, మార్చి 3: పీఆర్సీ విషయంలో ఉద్యోగులు సర్దుకుపోయినా, సంతృప్తిచెందకుండా నిరనసలు తెలుపుతున్న టీచర్లను ప్రభుత్వం ఇరుకునపెట్టడానికి ఉద్దేశించినట్లు భావిస్తున్న టోల్ఫ్రీ నంబరు విద్యాశాఖకు తలనొప్పిగా తయారైంది!. జగనన్న గోరుముద్ద (మధ్యాహ్న భోజన పథకం)లో నాణ్యత, అమలు తీరు, పాఠశాల మరుగుదొడ్ల నిర్వహణ తీరు, లోటుపాట్లు, జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీ తీరు, ఎదురవుతున్న సమస్యలు, పాఠశాల మౌలిక సౌకర్యాల, విద్యాబోధన- వాటి సమస్యలు వంటి ఐదు అంశాలను పేర్కొంటూ, ఇందులో ఏ సమస్య ఎదురైనా 14417 అనే టోల్ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలంటూ పాఠశాల విద్యాశాఖ ప్రచారం చేసింది. పేరుకు ఐదు అంశాలున్నా, విద్యాబోధనపైనే ప్రభుత్వం గురిపెట్టిందని, అంటే పరోక్షంగా పనితీరుపై నిఘా పెట్టి, జనాలను తమపైకి ఉసిగొల్పడానికే ప్రత్యేకించి టోల్ ఫ్రీ నంబర్ను రూపొందించారని ఒకింత ఆందోళన చెందారు. అయితే ఈ పథకం ప్రభుత్వానికే రివర్స్ అయ్యిందంటున్నారు. ప్రస్తుతం 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తున్నారు. దీనివల్ల తమ గ్రామంలోనే ఉన్న పాఠశాలను వదులుకుని 3కిలోమీటర్ల దూరం పిల్లలను పంపించాల్సి రావడంపట్ల అసంతృప్తితో ఉన్న తల్లిదండ్రులు, ఈ టోల్ఫ్రీ నంబర్కు వెల్లువలా ఫిర్యాదులు పంపుతున్నారని తెలిసింది
0 Response to "టీచర్లను బెదిరిద్దామనుకుంటే.."
Post a Comment