పీఎఫ్ పిడుగు
8.5% నుంచి 8.1శాతానికి తగ్గింపు.. నాలుగు దశాబ్దాల కనిష్ఠానికి
6 కోట్ల మందికి ఝలక్.. మార్కెట్ పరిస్థితులను బట్టే: కేంద్రమంత్రి
ఇది ప్రజలకు రిటర్న్ గిఫ్ట్: కాంగ్రెస్.. ఎన్నికలవగానే దాడి: సీపీఎం
గువాహటి/న్యూఢిల్లీ, మార్చి 12: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడగానే... కేంద్రం షాకులు ఇవ్వడం మొదలుపెట్టింది. ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) వడ్డీ రేటును 0.4 శాతం తగ్గించేసింది. 2020-21 సంవత్సరానికి 8.5 శాతం వడ్డీని ఉద్యోగుల ఈపీఎఫ్ ఖాతాల్లో జమచేశారు. 2021-22 సంవత్సరానికి దీన్ని 8.1 శాతానికి తగ్గించారు. కేంద్ర కార్మికశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ అధ్యక్షతన ఈపీఎ్ఫవో ట్రస్టీల కేంద్ర బోర్డు శనివారం గువాహటిలో సమావేశమైంది. ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.1 శాతానికి తగ్గించాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్టు అనంతరం కేంద్ర కార్మికమంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. బోర్డు సిఫారసును కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖకు పంపనున్నారు. ఆర్థికశాఖ ఆమోదం తెలిపిన తర్వాత 2021-22 సంవత్సరానికి 8.1 శాతం వడ్డీ రేటు లెక్కించి ఉద్యోగుల ఖాతాల్లో జమచేస్తారు అని ఆ ప్రకటనలో పేర్కొంది. కాగా, ప్రస్తుత మార్కెట్, అంతర్జాతీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ చెప్పారు. మార్కెట్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, అంతర్జాతీయ పరిస్థితులు సమీక్షించిన తర్వాత 8.1 శాతం వడ్డీ రేటును సిఫారసు చేశాం. సామాజిక భద్రత, మార్కెట్ స్థిరత్వ అంశాలను దృష్టిలో ఉంచుకొని, మనం అధిక రిస్క్ ఉండే సాధనాలను ఎంచుకోలేము. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం అన్నారు. ఇదే విషయాన్ని మంత్రి ట్విటర్లోనూ ఉంచారు. కాగా, గత 4 దశాబ్దాల్లో ఈపీఎ్ఫపై ఇదే కనిష్ఠ వడ్డీ రేటు అని అధికార వర్గాలు తెలిపాయి. 1977-78లో అతి తక్కువగా 8ు వడ్డీ జమచేశారని, ఆ తర్వాత ఇదే అతి తక్కువ అని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
ఏ సంవత్సరం ఎంత తగ్గించారు?
2015-16లో ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.8ు ఉండేది. 2016-17లో దాన్ని 8.65 శాతానికి తగ్గించారు. 2017-18లో మరింత(8.55ు) తగ్గించారు. కొవిడ్ నేపథ్యంలో 2019-20లో దాన్ని 8.5ుకు తగ్గించారు. 2020-21లోనూ 8.5ు వడ్డీ జమచేశారు. ఇప్పుడు ఏకంగా 8.1ుకు కుదించారు. ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లపై బ్యాంకులు వడ్డీని గణనీయంగా తగ్గించాయి. ఈ క్రమంలో ఈపీఎ్ఫపై అందించే వడ్డీ వేతన జీవులకు ఎంతో ఊరటనిస్తోంది. దీనికి కూడా కోతలు పెట్టడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రతినెలా జీతంలో కొంత కూడబెడితే..
ఉద్యోగుల భవిష్యనిధి చట్టం-1952 ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, కార్మికుల జీతంలో కొంత మొత్తాన్ని ఉద్యోగ విరమణ అనంతర ప్రయోజనాల కోసం ప్రావిడెంట్ ఫండ్లో పొదుపు చే యడం తప్పనిసరి. ప్రతినెలా ఉద్యోగులు, కార్మికుల బేసిక్ వేతనంలో కనీసం 12ును ప్రావిడెంట్ ఫండ్లో జమ చేస్తారు. అంతే మొత్తాన్ని యజమాని కూడా సంస్థ తరఫున జమ చేస్తారు. ఈపీఎ్ఫవోలో జమ అయిన ఈ మొత్తాలను వివిధ రంగాల్లో పెట్టుబడులుగా పెట్టి, వాటిపై వచ్చే లాభాల నుంచి చందాదారులకు వడ్డీ చెల్లిస్తున్నారు.
షేర్ మార్కెట్ లాభాలన్నీ ఏమవుతున్నాయి?
ఈపీఎ్ఫవో నిధుల్లో 85ును ప్రభుత్వ బాండ్లు, సెక్యూరిటీలు తదితర రుణ సాధనాల్లో పెట్టుబడిగా ఉంచుతారు. మరో 15 శా తాన్ని స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడతారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించినప్పుడు ఉద్యోగులు ఆందోళనలు నిర్వహించారు. అయితే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులతో భారీ లాభాలు వస్తాయని, ఉద్యోగుల మేలు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం అప్పట్లో తెలిపింది. అయితే, ఏటా వడ్డీ రేట్లు తగ్గిస్తుండటంతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు.
పెట్టుబడులు ఎలా పెడతారంటే..
ఈపీఎఫ్ నిధుల్లో 45-65ు ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడు లు పెడతారు. బ్యాంకులు, ప్రభుత్వ ఆర్థిక సంస్థలు, కార్పొరేట్ సంస్థలు జారీ చేసిన రుణ పత్రాల్లో మరో 20-50ు పెట్టుబడులు పెడతారు. దీంతోపాటు సెబీలో నమోదైన ఏ1+బై2 రేటింగ్ ఉన్న సంస్థల రుణ పత్రాల్లో 5ు పెట్టుబడులు పెడతారు. ఇక ఈక్విటీ పెట్టుబడుల విషయానికి వస్తే.. సెన్సెక్స్, నిఫ్టీలను అనుకరించే, సెబీలో నమోదైన ఎంఎఫ్, ఈటీఎ్ఫలలో ఈక్విటీల కోసం పెట్టుబడులు పెట్టొచ్చు. అలాగే, కనీసం 5 వేల కోట్ల పెట్టుబడులున్న కంపెనీల షేర్లలోనూ నేరుగా పెట్టుబడులు పెట్టొచ్చు. కాగా, ఈపీఎ్ఫవో రూ.12,785 కోట్లను ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టింది. పెట్టుబడులపై వచ్చే రూ.5,529 కోట్ల మూలధన లాభాలను 2021-22లో చందాదారులకు వడ్డీ చెల్లించేందుకు వినియోగించనుంది. రుణ పత్రాలు, ఈక్విటీల ద్వారా 2020-21లో ఈపీఎ్ఫవో రూ.72,812 కోట్లు ఆర్జించినట్టు మార్కెట్ వర్గాలు తెలిపాయి.
వేతన జీవులపై దాడి..
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలిచ్చిన విజయానికి ఇది రిటర్న్ గిఫ్ట్ అని కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది. 5 రాష్ట్రా ల ఎన్నికలు అయిపోగానే కోట్లాది మంది పొదుపుపై దాడి చేయడం సరైనదేనా? అని కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ట్వీట్ చేశారు. 5 రాష్ట్రాల ఎన్నికలు కాగా నే మోదీ ప్రభుత్వం వేతన జీవులపై దాడి పెంచిందని, దీన్ని ప్రతిఘటించాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పటికే నిరుద్యోగం, ధరల పెరుగుదల తదితర సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ట్వీట్ చేశారు. ఎన్నికలవగానే బీజేపీ ప్రభుత్వం తన అసలు రంగు బయటపెట్టిందని సీపీఐ ఎంపీ బినోయ్ విశ్వం విమర్శించారు. వడ్డీ రేటు తగ్గించే విషయాన్ని పునఃపరిశీలించాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు. సభ్యులు, పెన్షనర్ల జీవన సౌలభ్యం కోసమే లక్ష్యమని ఈపీఎఫ్ సంస్థ లక్ష్యాల్లో పేర్కొన్నారు. వడ్డీ రేటు తగ్గించడం దారుణం అని లేఖలో పేర్కొన్నారు
THE GOVERNMENT OF INDIA UNDER BJP WILL CAN DO FAVOURS ONLY TO CORPORATE 420.IF IT CONTINUE THE COUNTRY WILL BE SOLD SOON.
ReplyDelete