మేమంతా ఉద్యోగులమే... కలిసే ముందుకెళతాం: Shivareddy





విజయవాడ: నగరంలోని ఏపీ ఎన్జీఓ కార్యాలయం వద్ద ఉన్న బండి శ్రీనివాసరావు, శివారెడ్డిల ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించివేశారు. దీనిపై ఏపీ ఎన్జీవో ప్రధాన కార్యదర్శి శివారెడ్డి మాట్లాడుతూ ఫ్లెక్సీలు చింపడం బాధాకరమని, ఇలాంటి ఘటనలు ఎవరికీ మంచిది కాదన్నారు. ఉపాధ్యాయ సంఘాలు ఇలాంటి పనులు చేయరని తమ నమ్మకమని తెలిపారు. ఎవరో దుండగులు ఈ పని చేసి ఉంటారన్నారు. అభిప్రాయ బేధాలు ఉంటే... కూర్చుని మాట్లాడుకోవాలని సూచించారు. ఏయే పరిస్థితుల్లో తాము అంగీకరచామో ఇప్పటికే చెప్పామని తెలిపారు. ఎపీఎన్జీవో భవన్ ముట్టడికి పిలుపు ఇవ్వలేదని ఫ్యాప్టో నేతలు చెప్పారన్నారు. పీఆర్సీ సమస్య పరిష్కారం కావడంతో.. స్టీరింగ్ కమిటీ పని అయిపోయిందన్నారు. జేఏసీ నుంచి ఎవరూ బయటకు వెళ్లలేదని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులపై కింది స్థాయిలో ఒత్తిడి ఉందన్నారు. తమ వైపు నుండి ఉపాద్యాయులకు అవసరమైన సమయంలో మద్దతు ఇస్తామని అన్నారు. ‘‘మేమంతా ఉద్యోగులమే... కలిసే ముందుకెళతాం.. మా పోరాటంలో రాజకీయ పార్టీలకు సంబందం ఉండదు’’ అని శివారెడ్డి స్పష్టం చేశారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "మేమంతా ఉద్యోగులమే... కలిసే ముందుకెళతాం: Shivareddy"

Post a Comment