కేంద్ర ఉద్యోగులకు మళ్లీ బయోమెట్రిక్‌ హాజరు


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: ఒమైక్రాన్‌ కారణంగా సంభవించిన కొవిడ్‌ థర్డ్‌వేవ్‌ సద్దుమణగడంతో కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు బయోమెట్రిక్‌ హాజరును పునరుద్ధరించింది.


 ఇంటి నుంచి పని వెసులుబాటును ఎత్తివేసింది. ఈ మేరకు గురువారం కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఆదేశాలిచ్చింది. 


అయితే, కొవిడ్‌ నిబంధనలను మాత్రం కచ్చితంగా పాటించాలని సూచించింది. దేశంలో బుధవారం 30,757 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. 


541 మరణాలు నమోదయ్యాయి. యాక్టివ్‌ కేసులు 3.32 లక్షలకు తగ్గాయి.  

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " కేంద్ర ఉద్యోగులకు మళ్లీ బయోమెట్రిక్‌ హాజరు"

Post a Comment