బడ్జెట్ 2022 : ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు కొత్త వార్తలేవీ లేవు
ప్రధాన మంత్రి గతి శక్తి మిషన్, సమ్మిళిత అభివృద్ధి, ఉత్పాదకత పెంపు, ఆర్థిక పెట్టుబడులు- ఈ నాలుగు అంశాలపై ఈ బడ్జెట్ ప్రధానంగా దృష్టి సారిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ లోక్సభకు మంగళవారం చెప్పారు. 25,000 కిలోమీటర్ల మేరకు జాతీయ రహదారుల విస్తరణను లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కొత్తగా 400 వందే భారత్ రైళ్ళను ప్రారంభిస్తామన్నారు.
చిరు ధాన్యాలను ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. రసాయనాలు లేకుండా సాగు చేసే విధానాలను, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామన్నారు. రైతుల కోసం ప్రత్యేక పథకాలను ప్రకటించారు. భూముల రికార్డుల తయారీ కోసం కిసాన్ డ్రోన్లను ఉపయోగిస్తామని చెప్పారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధి రేటు 9.2 శాతంగా అంచనా వేసినట్లు తెలిపారు.
న్యూఢిల్లీ: విదేశాలకు ప్రయాణాలు చేసే వారి కోసం కొత్తగా ఈ-పాస్పోర్ట్ను తీసుకువస్తున్నట్లు మంగళవారం కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 2019లో తొలిసారి ఈ విధానాన్ని కేంద్రం ప్రకటించినప్పటికీ అది అమలు కాలేదు. ఈ ఏడాది నుంచే వీటి జారీని ప్రారంభిస్తామని మంత్రి స్పష్టం చేశారు. కొత్త విధానం వల్ల ప్రయాణికులకు ఎంతో భద్రత, ప్రయోజనాలు చేకూరుతాయని తెలిపారు. ప్రయాణాల సమయంలో ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ సులభతరం అయ్యేందుకు ఇది చాలా ఉపయోగపడుతుందని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా ఈ-పాస్పోర్ట్ ప్రధాన ఫీచర్లను మంత్రి వెల్లడించారు
* సులువుగా, చాలా తక్కువ సమయంలో యాక్సెస్ చేయగలగడం.
* ఈ-పాస్పోర్ట్ వెనక భాగంలో చిన్న సిలికాన్ చిప్ ఉంటుంది.
* ఈ చిప్లో 64 కిలోబైట్ల మెమొరీ స్పెస్ ఉంటుంది.
* ఈ చిన్న చిప్లోనే పాస్పోర్టుదారుడి ఫొటో, ఫింగర్ ప్రింట్తో సహా అన్ని వివరాలు నిక్షిప్తమై ఉంటాయి.
* పాస్పోర్ట్లోని వివరాలతో పాటు బయోమెట్రిక్ డీటైల్స్ కూడా ఈ చిప్లో స్టోర్ అయి ఉంటాయి. దీంతో గత ప్రయాణాల వివరాలు కూడా ఇందులో నిల్వ ఉంటాయి.
* వినియోగదారుడు ఒకసారి తీసుకున్న ఈ-పాస్పోర్ట్పై 30 విజిట్స్ చేయవచ్చు.
* అంతేగాక అమెరికాలోని ప్రముఖ లేబొరేటరీలో మొదట ఈ ఈ-పాస్పోర్ట్ నమూనాను పూర్తిగా పరీక్షించి, ఎలాంటి లోటుపాట్లు లేవని తేలిన తర్వాతే వాడకంలోకి అనుమతిస్తారు.
ఇలా ఎన్నో ప్రత్యేకతలతో ఈ డిజిటల్ పాస్పోర్ట్ రూపుదిద్దుకుంది. అలాగే ఈ-పాస్పోర్ట్ విధానం వల్ల నకిలీలను అరికట్టవచ్చు. ఈ కొత్త ఈ-పాస్పోర్ట్లో చాలా సెక్యూరిటీ ఫీచర్లు ఉంటాయి కావున నకిలీ పాస్పోర్ట్లు వాడే వారిని నిలువరించే వీలు కలుగుతుంది. ఇక ఇమ్మిగ్రేషన్ కౌంటర్లలో వివరాలను వేగంగా వెరిఫై చేసేందుకు పాస్పోర్ట్లోని మైక్రో చిప్ చాలా ఉపయోగపడుతుంది. దీని ద్వారా ప్రయాణాలు చేసేటప్పుడు సమయం చాలా ఆదా అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్ ప్రసంగం గంటన్నర సేపు సాగింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రసంగాన్ని 11.00 గంటలకు ప్రారంభించిన మంత్రి పన్నెండున్నర గంటలకు ముగించారు.కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా నేషనల్ పెన్షన్ స్కీమ్ డిడక్షన్ 14 శాతానికి పెంచుకునే అవకాశాన్ని కేంద్రమంత్రి కల్పించారు.ఐటీ రిటర్న్ దాఖలులో వెసులుబాటు కల్పించారు. ఆదాయపన్ను చెల్లింపుల్లో సవరణలకు రెండేళ్లలో అప్ డేట్ చేసుకునే అవకాశం కల్పించారు. రిటర్న్ లు సమర్పించిన రెండేళ్ల తర్వాత కూడా సవరణలు చేసుకోవచ్చు. త్వరలో ఈ పాస్ పోర్ట్ విధానం తీసుకువస్తామని మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించారు
దేశంలో 60 లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ ప్రభుత్వ తదుపరి లక్ష్యం అని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.కేంద్ర బడ్జెట్ 2022ను సమర్పిస్తూ నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రసంగించారు.‘‘పిఎం గతి శక్తి ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకువెళుతుంది, యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు వస్తాయి’’ అని ఆమె అన్నారు.దేశంలో యువత, మహిళలు, పేదలకు సాధికారత కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఆమె అన్నారు.ఆత్మనిర్భర్ భారత్ను సాధించడానికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్కు అద్భుతమైన స్పందన లభించిందని, దీని వల్ల వచ్చే ఐదేళ్లలో 60 లక్షల కొత్త ఉద్యోగాలు, 30 లక్షల కోట్ల రూపాయల అదనపు ఉత్పత్తిని సృష్టించే అవకాశం ఉందని నిర్మలాసీతారామన్ చెప్పారు
0 Response to "బడ్జెట్ 2022 : ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు కొత్త వార్తలేవీ లేవు"
Post a Comment