బడ్జెట్ 2022 : ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు కొత్త వార్తలేవీ లేవు


*కేంద్ర బడ్జెట్‌–2022–23 ముఖ్యాంశాలు....*

– రాష్ట్రాలకు వడ్డీ రహిత రుణాలు
– రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి వడ్డీ రహిత రుణ పరిమితిని రూ.15 వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్లు కేటాయింపు
– రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు వడ్డీ రహిత రుణాలు
– ఈ ఏడాది ద్రవ్యలోటు 6.9 గా ఉంటుందని అంచనా
– 2023లో ద్రవ్యలోటు 6.4 గా ఉంటుందని అంచనా
–  2022 మూలధన వ్యయం 35.4 శాతానికి పెంపు
– రూ.7.50 లక్షల కోట్లు కేటాయింపు
– ప్రతి తరగతికి ఒక టీవీ ఛానెల్‌ ద్వారా పాఠాలు, ప్రాంతీయ భాషల్లో పాఠాలు, ప్రస్తుతం 12 విద్యా టీవీ ఛానెల్స్‌ ఉండగా.. వీటిని 200 కి పెంపు
– 2 లక్షల అంగన్వాడీ కేంద్రాల అప్‌గ్రెడేషన్‌
– 75 జిల్లాల్లో 75 ఈ–బ్యాంకులు(డిజిటల్‌ బ్యాంక్స్‌)
– అన్ని పోస్టాఫీసుల్లో బ్యాంకింగ్‌ సేవలు. డిజిటల్‌ పేమెంట్, నెట్‌ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు
– ఇకపై డిజిటల్‌ పాస్‌పోర్టులు. చిప్‌ ఆధారిత పాస్‌పోర్టులు మంజూరు
– పీఎం గృహ నిర్మాణ పథకానికి రూ.48 వేల కోట్ల కేటాయింపులు
– ప్రధాని ఆవాస్‌ యోజన కింద 80 లక్షల ఇళ్లు నిర్మాణం
– అమృత్‌ పథకానికి 
– అర్బన్‌ ఏరియాలో పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టులుగా షిప్స్‌ ఉపయోగిస్తాం
– పట్టణ ప్రాంతాల అభివృద్ధికి ఉన్నత స్థాయి ప్యానెల్‌ ఏర్పాటు
– వచ్చే 3 ఏళ్లలో 400 కొత్త వందే భారత్‌ రైళ్లు
– దేశవ్యాప్తంగా వంద గతిశక్తి కార్గో టెర్మినల్స్‌ నిర్మాణం
– 25 వేల జాతీయ రహదారుల నిర్మాణం
– మేకిన్‌ ఇండియాలో భాగంగా 60 లక్షల ఉద్యోగాల కల్పన
– డిజిటల్‌ యూనివర్సిటీల ఏర్పాటుకు పూర్తి సహకారం
– వంట నూనె దేశీయంగా ఉత్పత్తి చేసేలా చర్యలు 
– పట్టణ ప్రణాళిక, ప్రజా రవాణాపై అధ్యయనం
– రూ250 కోట్లుతో 5 విద్యా సంస్థల ఏర్పాటు
– ఇకపై కేంద్ర మంత్రిత్వ శాఖల లావాదేవీలు ఆన్‌లైన్‌లోనే
– అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో కాగిత రహిత విధానం
– త్వరలో 5 జీ టెక్నాలజీ సేవలు, 2022 నాటికి 5 జి స్ప్రెక్టమ్‌ వేలం
– 2025 నాటికి ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ పూర్తి
– పీపీపీ రూపంలో గ్రామీణ ప్రాంతాల్లో ఆప్టికల్‌ ఫైబర్‌ కేబులింగ్‌
– ఎగుమతుల ప్రోత్సాహకానికి ఎస్‌ఈజెడ్‌లో సమూల మార్పులు
– ఎగుమతుల ప్రోత్సాహకానికి కొత్త చట్టం
– రక్షణ రంగంలోనూ ఆత్మనిర్భర్‌ భారత్‌ అమలు
– రక్షణ రంగంలో పరిశోధనలకు ప్రైవేట్‌ పరిశ్రమలు, స్టార్టప్‌లు, విద్యాసంస్థలకు అవకాశం 
– డిఫెన్స్‌ బడ్జెట్‌లో 25 శాతం డిఫెన్స్‌ రీసెర్చ్‌ కోసం కేటాయింపులు
– పర్యాటక ప్రాంతాల్లో పీపీపీ పద్ధతిలో అభివృద్ధి పనులు
– ఎనిమిది పర్యాటక ప్రాంతాల్లో 60 కిమీ మేర రోప్‌వేలు
– సోలార్‌ ఎనర్జీ ఉత్పత్తి కోసం రూ.19500 కేటాయింపులు
– 10 రంగాల్లో క్లీన్‌ ఎనర్జీ యాక్షన్‌ ప్లాన్‌
– ఎంఎస్‌ఎంఈల ఉత్పత్తుల అమ్మకాలకు ప్రత్యేక పోర్టల్‌
– వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలకు ప్రత్యేక పోర్టల్‌
– పీపీపీ మోడల్‌లో ఆహార శుద్ధి పరిశ్రమలు
– ఎస్‌సీ, ఎస్‌టీ రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు
– నిధుల సమీకరణకు సావర్‌ గ్రీన్‌ బాండ్ల 
– త్వరలో డిజిటల్‌ కరెన్సీని ప్రవేశపెట్టనున్న ఆర్బీఐ
– 2022–23లోనే అమల్లోకి డిజిటల్‌ కరెన్సీ
– డిజిటల్‌ కరెన్సీ కోసం బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ
– ఎలక్ట్రికల్‌ వాహనాలకు మరిన్ని ప్రోత్సాహకాలు
– త్వరలో రహదారులపై బ్యాటరీలు మార్చుకునే సౌకర్యం
– ప్రజారవాణాలో ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగానికి ప్రణాళికలు
– పెట్రో డీజిల్‌ వినియోగాన్ని భారీగా తగ్గించే వ్యూహం
– వచ్చే 5 ఏళ్లలో 60 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు. వద్ధిరేటులో మనం ముందున్నామని
– దేశ వ్యాప్తంగా కొత్తగా 25 వేల జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టినట్లు నిర్మల తెలిపారు.
వచ్చే ఐదేళ్లలో 13 లక్షల కోట్ల ఉత్పత్తి ఆధారిత ఇన్సెంటివ్‌లు అందిస్తున్నట్లు నిర్మల పేర్కొన్నారు.
– చిన్న, మధ్యతరహా రైతుల కోసం వన్‌నేషన్‌ వన్‌ప్రొడక్ట్‌ పథకం అమలు 
– 2023 నాటికి 2 వేల కి.మీ రైల్వే లైన్లు పెంపు
– రవాణ రంగంలో మౌలిక సదుపాయాల కోసం రూ.20 వేల కోట్టు కేటాయింపులు – భారత్‌లో అవసరాలకు అనుగుణంగా మెట్రో రైలు కనెక్టివిటీ 
– వచ్చే ఐదేళ్లలో 13 లక్షల కోట్ల ఉత్పత్తి ఆధారిత ఇన్సెంటివ్‌లు
– చిన్న రైతులు, చిన్న పరిశ్రమలకు అనుగుణంగా రైల్వే నెట్‌వర్క్‌
– వ్యవసాయ క్షేత్రాల పర్యవేక్షణకు కిసాన్‌డ్రోన్‌లను అభివృద్ధి
– దేశవ్యాప్తంగా సేంద్రీయ వ్యవసాయానికి ప్రొత్సాహం
– కృష్ణా,పెన్నా,కావేరి నదుల అనుసంధానానికి ప్రణాళిక
– ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఫైలింగ్‌ మరింత సులభతరం, రెండేళ్ల దాకా రిటర్స్న్ ఫైల్‌ చేసుకునే అవకాశం



ప్రధాన మంత్రి గతి శక్తి మిషన్, సమ్మిళిత అభివృద్ధి, ఉత్పాదకత పెంపు, ఆర్థిక పెట్టుబడులు- ఈ నాలుగు అంశాలపై ఈ బడ్జెట్ ప్రధానంగా దృష్టి సారిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ లోక్‌సభకు మంగళవారం చెప్పారు.  25,000 కిలోమీటర్ల మేరకు జాతీయ రహదారుల విస్తరణను లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.  కొత్తగా 400  వందే భారత్ రైళ్ళను ప్రారంభిస్తామన్నారు. 

చిరు ధాన్యాలను ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. రసాయనాలు లేకుండా సాగు చేసే విధానాలను, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామన్నారు. రైతుల కోసం ప్రత్యేక పథకాలను ప్రకటించారు. భూముల రికార్డుల తయారీ  కోసం కిసాన్ డ్రోన్లను ఉపయోగిస్తామని చెప్పారు. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధి రేటు 9.2 శాతంగా అంచనా వేసినట్లు తెలిపారు.





న్యూఢిల్లీ : 2022-23 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు కొత్త వార్తలేవీ లేవు. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఇన్‌కం ట్యాక్స్ బ్రాకెట్లో మార్పులేవీ ప్రతిపాదించలేదు. అప్‌డేటెడ్ ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేసేందుకు గడువును రెండు సంవత్సరాలకు పెంచుతున్నట్లు తెలిపారు

న్యూఢిల్లీ: విదేశాలకు ప్రయాణాలు చేసే వారి కోసం కొత్తగా ఈ-పాస్‌పోర్ట్‌ను తీసుకువస్తున్నట్లు మంగళవారం కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 2019లో తొలిసారి ఈ విధానాన్ని కేంద్రం ప్రకటించినప్పటికీ అది అమలు కాలేదు. ఈ ఏడాది నుంచే వీటి జారీని ప్రారంభిస్తామని మంత్రి స్పష్టం చేశారు. కొత్త విధానం వల్ల ప్రయాణికులకు ఎంతో భద్రత, ప్రయోజనాలు చేకూరుతాయని తెలిపారు. ప్రయాణాల సమయంలో ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ సులభతరం అయ్యేందుకు ఇది చాలా ఉపయోగపడుతుందని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా ఈ-పాస్‌పోర్ట్ ప్రధాన ఫీచర్లను మంత్రి వెల్లడించారు


* సులువుగా, చాలా తక్కువ సమయంలో యాక్సెస్ చేయగలగడం. 

* ఈ-పాస్‌పోర్ట్ వెనక భాగంలో చిన్న సిలికాన్ చిప్ ఉంటుంది. 

* ఈ చిప్‌లో 64 కిలోబైట్ల మెమొరీ స్పెస్ ఉంటుంది. 

* ఈ చిన్న చిప్‌లోనే పాస్‌పోర్టుదారుడి ఫొటో, ఫింగర్ ప్రింట్‌తో సహా అన్ని వివరాలు నిక్షిప్తమై ఉంటాయి. 

* పాస్‌పోర్ట్‌లోని వివరాలతో పాటు బయోమెట్రిక్ డీటైల్స్ కూడా ఈ చిప్‌లో స్టోర్ అయి ఉంటాయి. దీంతో గత ప్రయాణాల వివరాలు కూడా ఇందులో నిల్వ ఉంటాయి. 

* వినియోగదారుడు ఒకసారి తీసుకున్న ఈ-పాస్‌పోర్ట్‌పై 30 విజిట్స్ చేయవచ్చు. 

* అంతేగాక అమెరికాలోని ప్రముఖ లేబొరేటరీలో మొదట ఈ ఈ-పాస్‌పోర్ట్‌ నమూనాను పూర్తిగా పరీక్షించి, ఎలాంటి లోటుపాట్లు లేవని తేలిన తర్వాతే వాడకంలోకి అనుమతిస్తారు. 

ఇలా ఎన్నో ప్రత్యేకతలతో ఈ డిజిటల్ పాస్‌పోర్ట్ రూపుదిద్దుకుంది. అలాగే ఈ-పాస్‌పోర్ట్ విధానం వల్ల నకిలీలను అరికట్టవచ్చు. ఈ కొత్త ఈ-పాస్‌పోర్ట్‌లో చాలా సెక్యూరిటీ ఫీచర్లు ఉంటాయి కావున నకిలీ పాస్‌పోర్ట్‌లు వాడే వారిని నిలువరించే వీలు కలుగుతుంది. ఇక ఇమ్మిగ్రేషన్ కౌంటర్లలో వివరాలను వేగంగా వెరిఫై చేసేందుకు పాస్‌పోర్ట్‌లోని మైక్రో చిప్ చాలా ఉపయోగపడుతుంది. దీని ద్వారా ప్రయాణాలు చేసేటప్పుడు సమయం చాలా ఆదా అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు


న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్ ప్రసంగం గంటన్నర సేపు సాగింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రసంగాన్ని 11.00 గంటలకు ప్రారంభించిన మంత్రి పన్నెండున్నర గంటలకు ముగించారు.కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా నేషనల్ పెన్షన్ స్కీమ్ డిడక్షన్ 14 శాతానికి పెంచుకునే అవకాశాన్ని కేంద్రమంత్రి కల్పించారు.ఐటీ రిటర్న్ దాఖలులో వెసులుబాటు కల్పించారు. ఆదాయపన్ను చెల్లింపుల్లో సవరణలకు రెండేళ్లలో అప్ డేట్ చేసుకునే అవకాశం కల్పించారు. రిటర్న్ లు సమర్పించిన రెండేళ్ల తర్వాత కూడా సవరణలు చేసుకోవచ్చు. త్వరలో ఈ పాస్ పోర్ట్ విధానం తీసుకువస్తామని మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించారు


 దేశంలో 60 లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ ప్రభుత్వ తదుపరి లక్ష్యం అని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.కేంద్ర బడ్జెట్ 2022ను సమర్పిస్తూ నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రసంగించారు.‘‘పిఎం గతి శక్తి ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకువెళుతుంది, యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు వస్తాయి’’ అని ఆమె అన్నారు.దేశంలో యువత, మహిళలు, పేదలకు సాధికారత కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఆమె అన్నారు.ఆత్మనిర్భర్ భారత్‌ను సాధించడానికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్‌కు అద్భుతమైన స్పందన లభించిందని, దీని వల్ల వచ్చే ఐదేళ్లలో 60 లక్షల కొత్త ఉద్యోగాలు, 30 లక్షల కోట్ల రూపాయల అదనపు ఉత్పత్తిని సృష్టించే అవకాశం ఉందని నిర్మలాసీతారామన్ చెప్పారు




SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "బడ్జెట్ 2022 : ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు కొత్త వార్తలేవీ లేవు"

Post a Comment