కొత్త పిఆర్సీకి వ్యతిరేకంగా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ర్యాలీ

విశాఖపట్నం : కొత్త పిఆర్సీకి వ్యతిరేకంగా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ర్యాలీ చేపట్టింది. డీఎంహెచ్‌వో కార్యాలయం నుంచి సిబ్బంది ప్రదర్శనలో పాల్గొన్నారు. తమకు తీరని నష్టాన్ని చేకూర్చే కొత్త పీఆర్సీని రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది మాట్లాడుతూ.. 2022 జనవరి నెలకు పెండింగ్‌లో ఉన్న 5 డీఏలతో కలిపి పాత జీతాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. అశుతోష్ మిశ్రా కమిటీ వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.

కొవిడ్ సమయంలో కూడా ప్రాణాలకు తెగించి సేవలందించిన సిబ్బందికి ఇచ్చే కానుక ఇదేనా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "కొత్త పిఆర్సీకి వ్యతిరేకంగా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ర్యాలీ"

Post a Comment