మ్యాపింగ్‌పై అపోహలు తొలగించాలి ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఇబ్బంది ఉండదు: సురేశ్‌

అమరావతి, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): పాఠశాలల మ్యాపింగ్‌ వల్ల ఏవేవో అనర్థాలు జరుగుతాయంటూ వస్తున్న అపోహలను తొలగించి, విపక్షాల ఆరోపణలను ఖండించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపై ఉందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ అన్నారు


. దీనికోసం ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. జాతీయ విద్యావిధానంలో భాగంగా చేపడుతున్న పాఠశాలల మ్యాపింగ్‌ వల్ల విద్యావ్యవస్థ మెరుగుపడుతుంది తప్ప ఎలాంటి ఇబ్బందులూ ఉండవని స్పష్టంచేశారు. 



మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా తొలిరోజైన గురువారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేశ్‌ మాట్లాడుతూ.. మ్యాపింగ్‌ వల్ల ఏ ఒక్క పాఠశాలా మూతపడదని, ఉపాధ్యాయుల పోస్టులకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని చెప్పారు. ఈ విషయాన్ని సీఎం జగన్‌ పదేపదే చెప్పారన్నారు. 


ప్రజా ప్రతినిధుల సూచన మేరకు జిల్లాల వారీగా కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసేందుకు మంత్రి సుముఖత వ్యక్తంచేశారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "మ్యాపింగ్‌పై అపోహలు తొలగించాలి ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఇబ్బంది ఉండదు: సురేశ్‌"

Post a Comment