ఫైలు వచ్చాక నిర్ణయం తీసుకుంటాం


పీఆర్సీ వ్యాజ్యంపై సీజే స్పష్టీకరణ
అమరావతి, జనవరి 25(ఆంధ్రజ్యోతి):
పీఆర్సీ విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యంపై అత్యవసర విచారణ జరపాలని న్యాయవాది రవితేజ మంగళవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఈ సందర్భంగా సీజే స్పందిస్తూ.. ఫైలు ఇంకా తన ముందుకు రాలేదన్నారు. రిజిస్ట్రీ ఫైలు తన ముందు ఉంచిన తర్వాత పాలనాపరమైన నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో 1ని సవాల్‌ చేస్తూ ఏపీ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ జేఏసీ చైర్మన్‌ కేవీ కృష్ణయ్య హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఫైలు వచ్చాక నిర్ణయం తీసుకుంటాం"

Post a Comment