ట్రెజరీ ఉద్యోగులు, డీడీవోలకు ప్రభుత్వం మెమోలు
అమరావతి: ట్రెజరీ ఉద్యోగులు, డీడీవోలకు ప్రభుత్వం మెమోలు జారీ చేసింది. తక్షణమే ఉద్యోగుల జీతాల ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించింది. లేదంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. ప్రభుత్వానికి పే అండ్ అకౌంట్స్ ఉద్యోగుల సంఘం ఝలక్ ఇచ్చిన విషయం తెలిసిందే. పీఆర్సీపై ఉద్యమంలో భాగంగా వేతన, ఇతర ప్రభుత్వ బిల్లులను.. ప్రాసెస్ చేసేదిలేదని పే అండ్ అకౌంట్స్ ఉద్యోగుల సంఘం స్పష్టం చేసింది. తాము కూడా ఉద్యమంలో పాల్గొంటున్నామని ట్రెజరీ డైరెక్టర్కి ఉద్యోగులు లేఖ రాశారు. తమపై ఒత్తిడి తీసుకురావద్దని పే అండ్ ఎకౌంట్స్ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి చేసింది.
ఈ నేపథ్యంలోనే గురువారం ట్రెజరీ ఉద్యోగులతో ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బిల్లులను ప్రాసెస్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అయితే చర్యలు తీసుకున్నా సరే బిల్లులు ప్రాసెస్ చేయబోమని ఉద్యోగులు తేల్చి చెప్పారు. పెన్షనర్ల బిల్లులను పంపుతున్నామంటూ వెరిఫై చేసి పంపాలని ఉన్నతాధికారుల ఆదేశాలు ఇచ్చారు. తాము వెరిఫై చేసి పంపలేమని ఉద్యోగులు స్పష్టం చేశారు. తమను ఇబ్బంది పెట్టొద్దని ట్రెజరీ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు రవికుమార్ విజ్ఞప్తి చేశారు. వేరే శాఖల బిల్లులు వస్తే పంపాలని ఉన్నతాధికారులు సూచించారు. వస్తే పంపుతామని ట్రెజరీ ఉద్యోగులు చెప్పారు. తమకు పాత జీతాలే ఇవ్వాలంటూ ఉద్యోగులు నేరుగా లేఖలు రాస్తున్నారు. ఉద్యోగుల సహాయ నిరాకరణతో ఉన్నతాధికారులు అయోమయంలో పడ్డారు
0 Response to "ట్రెజరీ ఉద్యోగులు, డీడీవోలకు ప్రభుత్వం మెమోలు"
Post a Comment