AP: ఉగాది నాటికి కొత్త జిల్లాల ఏర్పాటుకు కేంద్రం బ్రేక్




అమరావతి: ఏపీలో ఉగాది నాటికి కొత్త జిల్లాల ఏర్పాటుకు కేంద్రం బ్రేక్ వేసింది. కేంద్ర జనగణన శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. జనగణన జరుగుతున్న సందర్భంగా 20, 22 జూన్ వరకు జిల్లాల సరిహద్దులు మార్చవద్దని జనగణన డైరెక్టర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ పంపారు. కోవిడ్ థర్డ్ వేవ్ వ్యాక్సినేషన్ జరుగుతుండటం వల్ల జనగణలో జాప్యం జరుగుతోందని జనగణన శాఖ డిప్యూటీ డైరెక్టర్  పేర్కొన్నారు. ఈ ఆదేశాలకు విరుద్ధంగా జిల్లాల పునర్విభజన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసింది. ఉగాది నాటికి కొత్త జిల్లాలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. కాగా జనగణన శాఖ తాజా ఆదేశాలతో జిల్లాల విభజనలో మరింత జాప్యం జరిగే అవకాశముంది. దీంతో ఉగాదికి పునర్విభజన జరిగే అవకాశం లేదని అధికారులు అంటున్నారు.

కాగా, పదమూడు జిల్లాల ఏపీని.. రాష్ట్ర ప్రభుత్వం 26 జిల్లాలుగా విస్తరించింది. 13 కొత్త జిల్లాలతో పాటు 12 కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై మంగళవారం అర్ధరాత్రి గెజిట్‌ నోటిఫికికేషన్‌ విడుదల చేసింది. దీనిపై ఏవిధమైన అభ్యంతరాలు ఉన్నా.. నెలరోజుల్లోగా ఆయా జిల్లాల కలెక్టర్లకు తెలపాలని ప్రజలను కోరింది. ఇందుకు ఫిబ్రవరి 26 వరకు గడువు విధించింది. ఈ మేరకు రెవెన్యూశాఖ తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. జిల్లాల ఏర్పాటు చట్టం-1974లోని సెక్షన్‌ 3(5) కింద కొత్తగా 13  జిల్లాలు, 12 రెవెన్యూ డివిజన్‌లను ప్రతిపాదించారు. ఈ ఉగాది నాటికి కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభించాలని సర్కారు సన్నాహాలు చేస్తోంది. ఈ సన్నాహాలకు కేంద్రం బ్రేక్ వేసింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "AP: ఉగాది నాటికి కొత్త జిల్లాల ఏర్పాటుకు కేంద్రం బ్రేక్"

Post a Comment