Ap News: విద్యార్థుల నైపుణ్యాల మెరుగుకు ప్రపంచ బ్యాంకుతో ఏపీ సర్కార్‌ రుణ ఒప్పందం





అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుతో రుణ ఒప్పందం చేసుకుంది. ప్రపంచ బ్యాంకుతో రూ.1,860 కోట్లకు రుణ ఒప్పందం కుదుర్చుకుంది. విద్యార్థుల నైపుణ్యాల మెరుగుకు ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ నెల 18న కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ అధికారుల ఆధ్వర్యంలో ఒప్పంద పత్రాలపై ఏపీ అధికారులు సంతకాలు చేయనున్నారు. ఈ ఒప్పందంతో ఏపీలోని 50 లక్షలకుపైగా విద్యార్థులు, ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "Ap News: విద్యార్థుల నైపుణ్యాల మెరుగుకు ప్రపంచ బ్యాంకుతో ఏపీ సర్కార్‌ రుణ ఒప్పందం"

Post a Comment