AP News: ఏపీ కేబినెట్‌ అత్యవసర భేటీ

అమరావతి: రాష్ట్ర కేబినెట్ సమావేశం సోమవారం ఉదయం ప్రారంభమైంది. మూడు రాజధానులపై కేబినెట్‌లో కీలక నిర్ణయం అంటూ ప్రచారం జరుగుతోంది. 3 క్యాపిటల్స్‌పై చేసిన చట్టంపై కాబినెట్‌లో చర్చ జరుగనుంది. మూడు రాజధానుల చట్టంలో మార్పులు చేస్తారా.... రద్దు చేస్తారా అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు రాష్ట్రంలో వరదల కారణంగా నేటితోనే శాసనసభ సమావేశాలను ముగించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ నిర్ణయం తర్వాత సమావేశాలను వాయిదా వేసే అవకాశం ఉంది


అమరావతి: ఏపీలో రాష్ట్ర మంత్రివర్గం కాసేపట్లో అత్యవసరంగా భేటీ కానుంది. వరదల కారణంగా ఇవాళ్టితోనే శాసన సభ సమావేశాలను ముగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

 కేబినెట్లో నిర్ణయం అనంతరం సమావేశాలను వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

మూడవ రోజు అసెంబ్లీ సమావేశాలు 10 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లిన కారణంగా పలు ప్రశ్నలు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. 



మరోవైపు మూడు రాజధానుల చట్టం విషయంలోనూ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "AP News: ఏపీ కేబినెట్‌ అత్యవసర భేటీ"

Post a Comment