భారివర్షాలు కారణం గా పాఠశాలలు నిర్వహణ పై విద్యాశాఖ డైరెక్టర్ సూచనలు విడుదల 22 తేది నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు- వివరణ..
అందరు జిల్లా విద్యాశాఖ అధికారులకు ప్రాంతీయ సంయుక్త సంచాలకులు విజ్ఞప్తి!
ప్రస్తుతం రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్న వానల వల్ల ఏవైనా పాఠశాల భవనాలు దెబ్బతిని ఉన్నా లేదా దెబ్బతినే అవకాశం ఉన్నా ఆయా భవనాల్లో తరగతులు నడపకండి. ఏవైనా భవనాలు పాడుబడి కూల్చివేయడానికి సిద్ధంగా ఉన్నట్లైతే పిల్లల్ని ఆ దరిదాపులకు పోనివ్వకండి. అక్కడ ' ప్రమాదం ' అనే హెచ్చరికతో ఒక బోర్డు పెట్టించండి. నీళ్ళు నిల్వ ఉండే గుంతలు, గోతులు, పాడుపడ్డ బావులు మొదలైన వాటి దగ్గరకు పిల్లలు వెళ్ళకుండా జాగ్రత్తపడండి. రాష్ట్రంలో వానలు కురుస్తున్న నేపథ్యంలో పాఠశాల భద్రతకు, విద్యార్థుల భద్రతకు సంబంధించిన అన్ని సూచనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండవలసిందిగా అందరు మండల విద్యాశాఖ అధికారులకు, ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేయండి.
సంచాలకుడు, పాఠశాల విద్యాశాఖ
0 Response to "భారివర్షాలు కారణం గా పాఠశాలలు నిర్వహణ పై విద్యాశాఖ డైరెక్టర్ సూచనలు విడుదల 22 తేది నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు- వివరణ.."
Post a Comment