అమరావతి: ప్రభుత్వంలో విలీనం చేయాలని ఎయిడెడ్ విద్యా సంస్థలను సర్కార్ బలవంతం చేయడం లేదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. విద్యా సంస్థల అంగీకారంతోనే ప్రభుత్వం వాటిని తీసుకుంటుందన్నారు. విద్యా సంస్థలను ఎవరు నడిపినా ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు. తామే నడుపుకుంటామంటే వెనక్కి తీసుకోవచ్చని స్పష్టం చేశారు. విద్యా సంస్థల అభివృద్ధి కోసమే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని మంత్రి వెల్లడించారు
0 Response to "Telugu news: విద్యాసంస్థల అంగీకారంతోనే తీసుకుంటున్నాం.. బలవంతం చేయట్లేదు: సురేశ్"
Post a Comment