Telangana: ఇంజినీరింగ్ కన్వీనర్ కోటా సీట్లు.. ఏ బ్రాంచిలో ఎన్నో తెలుసా
హైదరాబాద్: తెలంగాణలో ఇంజినీరింగ్ కన్వీనర్ కోటాలో ఈ ఏడాది 66,290 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మరో 6,629 సీట్లను ఈడబ్ల్యూఎస్ కోటాలో భర్తీ చేయనున్నారు. విద్యార్థుల నుంచి ఎక్కువ డిమాండ్ ఉన్న సీఎస్ఈలోనే అత్యధిక సీట్లు ఉన్నాయి.
గతేడాది నుంచి పలు కాలేజీలు మెకానికల్, ఎలక్ట్రికల్ వంటి సంప్రదాయ కోర్సుల్లో సీట్లను వెనక్కి ఇచ్చి.. ఐటీ కోర్సులను ప్రవేశ పెడుతున్నాయి. ఈ ఏడాది వివిధ కాలేజీల్లో సీఎస్ఈలో 16,801 సీట్లకు యూనివర్సిటీలు అనుమతినిచ్చాయి. ఆ తర్వాత అత్యధికంగా ఈసీఈలో 12,582 సీట్లు అందాబాటులో ఉన్నాయి. సీఎస్ఈలో ఆర్టిఫీషియల్ ఇంజినీరింగ్, మెషిన్ లెర్నింగ్ కోర్సులో 5,037 సీట్లు, డేటా సైన్స్లో 3,003, సైబర్ సెక్యూరిటీలో 1,638, ఐఓటీలో 1,029 సీట్లు ఉన్నాయి.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 4,713 ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్సులో 420 సీట్లు ఉన్నాయి. ఈఈఈలో 6,366, సివిల్ ఇంజినీరింగ్లో 5,766, మెకానికల్ ఇంజినీరింగ్లో 5,355 సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేయనున్నారు. ఈడబ్ల్యూఎస్ కోటాలో మరో 10శాతం సీట్లు అదనంగా ఉంటాయి. గతేడాదితో పోల్చితే కొత్తగా కోర్సులు రాకపోయినప్పటికీ.. డిమాండ్ ఉన్న కోర్సుల్లో కొన్ని పెరిగాయి. ఫార్మా కోర్సుల్లో ఎంపీసీ, బైపీసీ అభ్యర్థులకు సమానంగా సీట్లను కేటాయించారు. ఎంపీసీ అభ్యర్థులకు బీ ఫార్మసీలో 3,220, ఫార్మ్ డీలో 520 సీట్లున్నాయి. కన్వీనర్ కోటా సీట్ల భర్తీ కోసం వెబ్ ఆప్షన్ల నమోదు ఈనెల 16తో ముగియనుంది. ఇవాళ్టి వరకు 47,471 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు
0 Response to "Telangana: ఇంజినీరింగ్ కన్వీనర్ కోటా సీట్లు.. ఏ బ్రాంచిలో ఎన్నో తెలుసా"
Post a Comment