రేపటి నుంచి డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్లు
అమరావతి, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో బీఏ, బీకాం, బీఎస్సీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ గురువారం విడుదల చేస్తామని ఏపీ ఉన్నత విద్యామండలి కార్యదర్శి సుధీర్ ప్రేమ్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ తదితర కోర్సుల్లో ప్రవేశానికి మొదటి దశ అడ్మిషన్ల ప్రక్రియ ఈ నెల 17వ తేదీ నుంచి 22వ తేదీ వరకు జరగనుంది. విద్యార్థులు ్చౌఝఛీఛి.్చఞ.జౌఠి.జీుఽ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వెబ్ ఆఫ్షన్ల ప్రక్రియ ఈ నెల 23 తేదీ నుంచి 26 వరకు ఉంటుంది. ఈ నెల 29వ తేదీన సీట్లు కేటాయిస్తారు. నవంబరు 1 తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ప్రత్యేక కేటగిరి విద్యార్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ 23వ తేదీ నుంచి 24 వరకు జర గనుంది. దివ్యాంగులు, ఎన్సీసీ, స్పోర్ట్స్ విద్యార్థులు ఆప్షన్లకు ముందుగానే దగ్గర్లోని హెల్ప్లైన్ సెంటర్కు వెళ్లి సర్టిఫికెట్ల పరీశీలన చేయించుకోవాలి.
0 Response to "రేపటి నుంచి డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్లు"
Post a Comment