టీచర్ల బదిలీ అవినీతిపై ఏసీబీ విచారణకు పిటిషన్
పెరంబూర్(చెన్నై): రాష్ట్రంలో 2020-21 సంవత్సరంలో టీచర్ల బదిలీ కౌన్సెలింగ్కు సంబంధించి జరిగిన అవినీతిపై ఏసీబీచే విచారించాలనే పిటిషన్పై కౌంటర్ అఫిడివిట్ దాఖలుచేయాలని హైకోర్టు మదురై డివిజన్ బెంచ్ రాష్ట్రప్రభుత్వానికి నోటీసు జారీచేసింది. మదురైకి చెందిన కేకే రమేష్ హైకోర్టు మదురై డివిజన్ బెంచ్లో దాఖలుచేసిన పిటిషన్లో, రాష్ట్రంలో కౌన్సెలింగ్ ద్వారా టీచర్ల బదిలీలు జరుగుతాయని, అలాగే నిర్వహణ కారణాల రీత్యా కూడా బదిలీలు జరుగుతాయన్నారు. నిర్వహణ బదిలీల్లో పలు అవకతవకలు జరిగాయని, టీచర్ల బదిలీలకు సంబంధించి 2019లో హైకోర్టు కొన్ని సూచనలు చేసిందని పేర్కొన్నారు. 2020-21లో టీచర్ల బదిలీ కౌన్సె లింగ్ నిర్వహించలేదని, నిర్వహణ కారణాల రీత్యా జరిగిన బదిలీల్లో లక్షలు తీసుకొని బదిలీలు చేశారన్నారు. ఈ బదిలీల అవినీతిపై ఏసీబీచే విచారణ చేపట్టాలని పిటిషన్లో కోరారు. దీనిని విచారించిన న్యాయమూర్తులు ఎం.దురైస్వామి, కె. మురళీ శంకర్లతో కూడిన ధర్మాసనం, దీనిపై కౌంటర్ అఫిడివిట్ దాఖలుచేయాలని హోంశాఖ కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శులకు నోటీసు జారీచేసి, తదుపరి విచారణ అక్టోబరు 27వ తేదీకి వాయిదావేసింది
0 Response to "టీచర్ల బదిలీ అవినీతిపై ఏసీబీ విచారణకు పిటిషన్"
Post a Comment