ఏపీలో ముగిసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్
అమరావతి: ఏపీలో 6,985 ఎంపీటీసీ, 441 జెడ్పీటీసీ స్థానాలకు కౌంటింగ్ ముగిసింది. తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల కౌంటింగ్కు అర్ధరాత్రి పట్టొచ్చని పంచాయితీ రాజ్ కమిషనర్ గిరిజాశంకర్ తెలిపారు. పూర్తి స్థాయి ఫలితాల వెల్లడికి మరింత సమయం పడుతుందన్నారు. మడకశిర మండలంలో 1 ఎంపీటీసీకి సంబంధించి రీపోల్కు అవకాశం ఉందని చెప్పారు. దీనిపై ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంటుందని గిరిజాశంకర్ పేర్కొన్నారు
0 Response to "ఏపీలో ముగిసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్"
Post a Comment