ఏపీలో ముగిసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్

అమరావతి: ఏపీలో 6,985 ఎంపీటీసీ, 441 జెడ్పీటీసీ స్థానాలకు కౌంటింగ్ ముగిసింది. తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల కౌంటింగ్‌కు అర్ధరాత్రి పట్టొచ్చని పంచాయితీ రాజ్ కమిషనర్‌ గిరిజాశంకర్  తెలిపారు. పూర్తి స్థాయి ఫలితాల వెల్లడికి మరింత సమయం పడుతుందన్నారు. మడకశిర మండలంలో 1 ఎంపీటీసీకి సంబంధించి రీపోల్‌కు అవకాశం ఉందని చెప్పారు. దీనిపై ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంటుందని గిరిజాశంకర్  పేర్కొన్నారు



మొత్తం 614 జడ్పీటీసీ, 9589 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్‌ 8న జరిగిన పోలింగ్‌లో మొత్తం 1,29,55,980 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొవిడ్‌ జాగ్రత్తలతో 13 జిల్లాల్లో 209 కేంద్రాల్లో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరిగింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఏపీలో ముగిసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్"

Post a Comment