అసెంబ్లీ నియోజకవర్గానికొక ఐటీఐ

అమరావతి, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోను ఒక ఐటీఐ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. అదేవిధంగా ఐటీఐలలో సిలబ్‌సను కాలానికి అనుగుణంగా మార్చాలని సూచించారు. ప్రతి ఐటీఐలోను నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ వంటి సంస్థలను భాగస్వాములను చేసే ఆలోచన చేయాలన్నారు. దీనివల్ల అభ్యర్థుల నైపుణ్యాలు మెరుగుపడతాయని తెలిపారు. ఈ మేరకు నైపుణ్యాభివృద్ధిపై సీఎం జగన్‌ సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోనూ ఒక నైపుణ్యాభివృద్ధి(స్కిల్‌) కళాశాలను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. విశాఖపట్నంలో హైఎండ్‌ స్కిల్‌ యూనివర్సిటీ, తిరుపతిలో స్కిల్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

నైపుణ్యాభివృద్ధి కళాశాలల్లో కోర్సులను స్కిల్‌ యూనివర్సిటీలు రూపొందిస్తాయన్నారు. కోడింగ్‌, లాంగ్వేజెస్‌, రోబోటిక్స్‌, ఐఓటీ వంటి అంశాల్లో పరిజ్ఞానాన్ని పెంచేలా నైపుణ్యాభివృద్ధి కళాశాలల్లో బోధన, శిక్షణ ఉంటుందని తెలిపారు. విశాఖపట్నంలో హైఎండ్‌ స్కిల్‌ యూనివర్సిటీ పనులు వెంటనే మొదలు పెట్టాలన్నారు. గ్రామాల్లో ఇంటర్నెట్‌ సదుపాయం ఏర్పాటు చేయడం ద్వారా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కాన్సెప్ట్‌ బలోపేతం అవుతుందన్నారు. కొత్తగా వచ్చే పరిశ్రమల్లో 75ు ఉద్యోగాలు స్థానికులకే వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.


సీఎం జగన్‌ను కలసిన కొత్త సీఎస్‌ సమీర్‌ శర్మ

సీఎం జగన్‌ని సీఎ్‌సగా నియమితులైన సమీర్‌శర్మ సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తనను సీఎ్‌సగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ప్రణాళికా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమీర్‌శర్మ... ఈ నెల 30న సీఎస్‌ అదిత్యనాథ్‌దాస్‌ నుంచి బాధ్యతలు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "అసెంబ్లీ నియోజకవర్గానికొక ఐటీఐ"

Post a Comment