ప్రతిష్టాత్మక మాంటిస్సోరీ పాఠశాలను మూసివేయాలని యాజమాన్యం నిర్ణయించింది

విజయవాడ: ప్రతిష్టాత్మక మాంటిస్సోరీ పాఠశాలను మూసివేయాలని యాజమాన్యం నిర్ణయించింది. ఎయిడెడ్ విద్యాసంస్థలకు గ్రాంటు నిలిపివేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పాఠశాలను మూసివేయాలని యాజమాన్యం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్త్రీ విద్యను ప్రోత్సహించాలనే గొప్ప లక్ష్యంతో 67 యేళ్ళ క్రితం మాంటిస్సోరి పాఠశాలను స్థాపించారు. 13 మంది ఉపాధ్యాయులను ప్రభుత్వం తీసుకున్నందున పాఠశాలను పూర్తిగా మూసివేయాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల తల్లిదండ్రులకు టీసీలు తీసుకెళ్లాలని పాఠశాల యాజమాన్యం నోటీసులు పంపించింది. రాష్ట్రంలో మూతబడుతున్న తొలి పాఠశాల మాంటిస్సోరి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " ప్రతిష్టాత్మక మాంటిస్సోరీ పాఠశాలను మూసివేయాలని యాజమాన్యం నిర్ణయించింది"

Post a Comment