AP News: పాఠశాలలో 19 మంది విద్యార్థులకు కరోనా
పాడేరు: విశాఖ జిల్లా జి.మాడుగుల మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలుర పాఠశాలలో కరోనా కలకలం రేగింది. అక్కడ చదువుతున్న 19 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్గా తేలింది.
వారిని పాడేరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాఠశాలలో మొత్తం 140 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో కొందరికి కరోనా లక్షణాలు ఉండటంతో ముందస్తు చర్యగా విద్యార్థులందరికీ కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశారు. వారిలో 19 మందికి పాజిటివ్గా తేలింది. దీంతో అధికారులు పాఠశాలకు వారం రోజులు సెలవు ప్రకటించారు
0 Response to "AP News: పాఠశాలలో 19 మంది విద్యార్థులకు కరోనా"
Post a Comment