75 ఏళ్లు దాటిన వారికి ఐటీ రిటర్నులు అక్కర్లేదు పింఛను, వడ్డీ ఆదాయం ఒకే బ్యాంకులో అయితేనే

దిల్లీ: 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి 75 ఏళ్లు దాటిన వయో వృద్ధులు, ఐటీ రిటర్నుల దాఖలు నుంచి మినహాయింపు పొందేందుకు అవసరమైన వాంగ్మూల పత్రాలను ఐటీ విభాగం నోటిఫై చేసింది. 75 ఏళ్లు దాటిన సీనియర్‌ సిటిజన్లు ‘పింఛను ఆదాయం, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ ఒకే బ్యాంకు నుంచి పొందుతుంటే’ వారు 2021 ఏప్రిల్‌ 1 నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా
సీతారామన్‌ గత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో వెల్లడించారు. ఈ మేరకు కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) తాజాగా నిబంధనలతో సహా డిక్లరేషన్‌ ఫామ్‌లను నోటిఫై చేసింది. వీటిని సంబంధిత బ్యాంకుల్లో సమర్పిస్తే మూలం వద్ద పన్ను కోతను (టీడీఎస్‌) ఆ బ్యాంకులు నిలిపివేస్తాయని తెలిపింది. అయితే పింఛను డిపాజిట్‌ అయ్యే బ్యాంకులోనే వడ్డీ ఆదాయం కూడా ఉంటేనే ఐటీఆర్‌ ఫైలింగ్‌ నుంచి మినహాయింపు లభిస్తుందని ఐటీ విభాగం వెల్లడించింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "75 ఏళ్లు దాటిన వారికి ఐటీ రిటర్నులు అక్కర్లేదు పింఛను, వడ్డీ ఆదాయం ఒకే బ్యాంకులో అయితేనే"

Post a Comment