వయో పరిమితి 42 ఏళ్లే

అమరావతి, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): ఏపీపీఎస్సీ ద్వారా భర్తీచేసే ఉద్యోగాల కోసం అభ్యర్థుల వయో పరిమితిని 42 ఏళ్లకే పరిమితం చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు అభ్యర్థుల వయో పరిమితి వాస్తవానికి 34 ఏళ్లు. అయితే, అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గత టీడీపీ ప్రభుత్వం వయో పరిమితిని 42 ఏళ్లకు పెంచుతూ 2016లోనే ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల గడువు పాత నోటిఫికేషన్లతో ముగిసిపోయింది. దీంతో మళ్లీ అదే వయోపరిమితిని కొనసాగిస్తూ జీవో జారీ చేశారు. 30.9.2022లోపు ఏపీపీఎస్సీ విడుదల చేసే ఉద్యోగాలకు ఈ మినహాయింపు వర్తిస్తుందని పేర్కొన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "వయో పరిమితి 42 ఏళ్లే"

Post a Comment