3వ తరగతి నుంచి సబ్జెక్టు టీచర్లు రెండో దశ నాడు - నేడుకు వెంటనే టెండర్లు పిలవాలి ప్రతి పాఠశాలకూ కంటింజెన్సీ ఫండ్ విద్యాశాఖపై సమీక్షలో సీఎం జగన్
ఈనాడు, అమరావతి: పాఠశాలల్లో కనీసం మూడో తరగతి నుంచి సబ్జెక్టుల వారీగా టీచర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి జగన్ సూచించారు. నాడు-నేడు రెండో విడత కింద 12,663 పాఠశాలల్లో రూ.4,535 కోట్లతో చేపట్టే పనులకు వెంటనే టెండర్లు పిలవాలన్నారు.
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ పనితీరును సీఎం మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన విద్యా విధానం అమలుకు అన్నివిధాలా సన్నద్ధం కావాలని సూచించారు. పాఠ్యపుస్తకాల ముద్రణలో నాణ్యత పెంచాలని చెప్పారు. ముందుగా వెయ్యి పాఠశాలలను సీబీఎస్ఈకి అనుబంధం చేస్తున్నామని అధికారులు చెప్పగా... ఐసీఎస్ఈకి అనుబంధం చేయడంపైనా దృష్టి పెట్టాలని తెలిపారు. ‘పాఠశాలల్లోని మరుగుదొడ్ల నిర్వహణపై ప్రత్యేకశ్రద్ధ చూపాలి. భవనాల మరమ్మతులకు ప్రతి పాఠశాలలో కంటింజెన్సీ ఫండ్ ఉండాలి. దీనికోసం నిర్దిష్ట విధానాన్ని రూపొందించాలి. అప్పుడే పాఠశాలలు నిత్య నూతనంగా ఉంటాయి’ అని సూచించారు. కొవిడ్ సమస్య తగ్గుముఖం పడుతున్నందున వచ్చే ఏడాది పిల్లలు పాఠశాలలు వెళ్లే నాటికే విద్యా కానుక అందించాలన్నారు. వచ్చే ఏడాది నుంచి విద్యా కానుకలో స్పోర్ట్స్ షూ, స్పోర్ట్స్ డ్రస్ మంచి నాణ్యతతో అందించాలని ఆదేశించారు. స్వేచ్ఛ పేరుతో ఆడపిల్లలకు శానిటరీ నాప్కిన్లు ఇచ్చే కార్యక్రమాన్ని అక్టోబరులో ప్రారంభిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. నాడు-నేడు రెండో విడతలో 18,498 అదనపు గదుల్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. మూడో విడతలో 24,900 పాఠశాలల్లో రూ.7,821 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు వివరించారు. ఈ పనులపై సచివాలయంలో ఇంజినీర్లకు, తల్లిదండ్రుల కమిటీలకు శిక్షణ ఇస్తామని చెప్పారు. సమీక్షలో మంత్రులు ఆదిమూలపు సురేష్, తానేటి వనిత, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రాజశేఖర్, మహిళా, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి అనురాధ, ఆర్థికశాఖ కార్యదర్శి గుల్జార్ తదితరులు పాల్గొన్నారు
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ పనితీరును సీఎం మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన విద్యా విధానం అమలుకు అన్నివిధాలా సన్నద్ధం కావాలని సూచించారు. పాఠ్యపుస్తకాల ముద్రణలో నాణ్యత పెంచాలని చెప్పారు. ముందుగా వెయ్యి పాఠశాలలను సీబీఎస్ఈకి అనుబంధం చేస్తున్నామని అధికారులు చెప్పగా... ఐసీఎస్ఈకి అనుబంధం చేయడంపైనా దృష్టి పెట్టాలని తెలిపారు. ‘పాఠశాలల్లోని మరుగుదొడ్ల నిర్వహణపై ప్రత్యేకశ్రద్ధ చూపాలి. భవనాల మరమ్మతులకు ప్రతి పాఠశాలలో కంటింజెన్సీ ఫండ్ ఉండాలి. దీనికోసం నిర్దిష్ట విధానాన్ని రూపొందించాలి. అప్పుడే పాఠశాలలు నిత్య నూతనంగా ఉంటాయి’ అని సూచించారు. కొవిడ్ సమస్య తగ్గుముఖం పడుతున్నందున వచ్చే ఏడాది పిల్లలు పాఠశాలలు వెళ్లే నాటికే విద్యా కానుక అందించాలన్నారు. వచ్చే ఏడాది నుంచి విద్యా కానుకలో స్పోర్ట్స్ షూ, స్పోర్ట్స్ డ్రస్ మంచి నాణ్యతతో అందించాలని ఆదేశించారు. స్వేచ్ఛ పేరుతో ఆడపిల్లలకు శానిటరీ నాప్కిన్లు ఇచ్చే కార్యక్రమాన్ని అక్టోబరులో ప్రారంభిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. నాడు-నేడు రెండో విడతలో 18,498 అదనపు గదుల్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. మూడో విడతలో 24,900 పాఠశాలల్లో రూ.7,821 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు వివరించారు. ఈ పనులపై సచివాలయంలో ఇంజినీర్లకు, తల్లిదండ్రుల కమిటీలకు శిక్షణ ఇస్తామని చెప్పారు. సమీక్షలో మంత్రులు ఆదిమూలపు సురేష్, తానేటి వనిత, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రాజశేఖర్, మహిళా, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి అనురాధ, ఆర్థికశాఖ కార్యదర్శి గుల్జార్ తదితరులు పాల్గొన్నారు
0 Response to "3వ తరగతి నుంచి సబ్జెక్టు టీచర్లు రెండో దశ నాడు - నేడుకు వెంటనే టెండర్లు పిలవాలి ప్రతి పాఠశాలకూ కంటింజెన్సీ ఫండ్ విద్యాశాఖపై సమీక్షలో సీఎం జగన్"
Post a Comment