21న ఉదయం 10నుంచి 12 గంటల వరకు ఎడ్సెట్- 2021ను
ఏయూ క్యాంపస్ (విశాఖపట్నం), సెప్టెంబరు 17:రాష్ట్రవ్యాప్తంగా బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు 21న ఉదయం 10నుంచి 12 గంటల వరకు ఎడ్సెట్- 2021ను నిర్వహించనున్నట్టు కన్వీనర్ ప్రొఫెసర్ కె.విశ్వేశ్వరరావు తెలిపారు. పరీక్ష కేంద్రానికి నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని, కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుందన్నారు. మొత్తం 15,638మంది దరఖాస్తు చేసుకోగా, రాష్ట్రవ్యాప్తంగా 69కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
విద్యార్థులు https://sche.ap. gov.in /edcet వెబ్సైట్ నుంచి హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు
0 Response to "21న ఉదయం 10నుంచి 12 గంటల వరకు ఎడ్సెట్- 2021ను"
Post a Comment