ఉద్యోగార్థుల కోసం రూ.200 కోట్లతో ప్రత్యేక శిక్షణ కేంద్రం అహ్మదాబాద్‌లో నిర్మించిన పటిదార్‌ సంఘం 11న ప్రారంభించనున్న ప్రధాని మోదీ

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉద్యోగార్థుల శిక్షణ కోసం పటిదార్‌ సంఘం నిర్మించిన 13 అంతస్తుల భవన సముదాయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. సర్దార్‌ధామ్‌ పేరుతో నిర్మించిన ఇదే ప్రాంగణంలో పటిదార్‌ వర్గానికి చెందిన 800 మంది బాలికలకు, 800 మంది బాలురకు వేర్వేరుగా వసతి
సదుపాయం అందించనున్నట్లు పటిదార్‌ సంఘం పేర్కొంది. దీని నిర్మాణానికి రూ.200 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పింది. మరో రూ.200 కోట్లతో ఇక్కడ మహిళల వసతి గృహాన్ని నిర్మించనున్నామని, దీనికి మోదీ శనివారం శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపింది. ఇది అందుబాటులోకి వచ్చాక 2,500 మంది మహిళలకు వసతి కల్పించనున్నట్లు వెల్లడించింది. ఈ ప్రాంగణంలో 1,000 కంప్యూటర్లతో ఈ-లైబ్రరీ, ఆడిటోరియం, పటిదార్‌ వర్గానికి చెందిన ఔత్సాహిక వ్యాపారవేత్తలకు నైపుణ్య అభివృద్ధి కేంద్రం, కెరీర్‌ గైడెన్స్‌ సెంటర్‌, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారికి నాలుగు తరగతి గదులను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. దళితులు సహా ఇతర వర్గాలవారికి ఆన్‌లైన్‌ ద్వారా ఉచిత శిక్షణ అందించనున్నట్లు చెప్పింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఉద్యోగార్థుల కోసం రూ.200 కోట్లతో ప్రత్యేక శిక్షణ కేంద్రం అహ్మదాబాద్‌లో నిర్మించిన పటిదార్‌ సంఘం 11న ప్రారంభించనున్న ప్రధాని మోదీ"

Post a Comment