సీపీఎస్పై సర్కారు ఉక్కిరిబిక్కిరి
సీపీఎస్పై సర్కారు ఉక్కిరిబిక్కిరి
రెండేళ్లుగా కమిటీల పేరుతో కాలయాపన
ఉద్యోగుల ఉద్యమ కార్యాచరణతో మల్లగుల్లాలు
1 నుంచి ఆందోళనల ఉధృతికి ఉద్యోగుల సన్నద్ధం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
సీపీఎస్ రద్దు కోరుతూ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఉద్యమ కార్యాచరణ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రెండేళ్ల నుంచి కమిటీల పేరుతో కాలయాపన చేసిన ప్రభుత్వానికి ఇప్పుడు దీనిపై నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. సీపీఎ్సను రద్దు చేయాలంటూ ఉద్యోగులు ఇప్పటికే కార్యాచరణ రూపొందించుకోవడంపై ఉన్నతస్థాయిలోనే చర్చ జరుగుతున్నట్లు తెలిసింది.
ఈ
ఈ వ్యవహారంపై ఏం చేయాలని ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. 2019 ఎన్నికల ముందు నిర్వహించిన పాదయాత్ర సందర్భంగా అధికారంలోకి వచ్చిన వారంలోనే సీపీఎస్ రద్దుచేసి తీరతామని అప్పటి ప్రతిపక్షనేత, ప్రస్తుత సీఎం జగన్ ప్రతిచోటా ప్రకటించారు. ఆ మాటలను విశ్వసించి తమ కుటుంబాలతో సహా జై కొట్టామని.. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా దీనిపై ఏ నిర్ణయం తీసుకోనేలేదని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2లక్షల మంది ఉద్యోగులు వాపోతున్నారు. సీపీఎస్ రద్దుపై సర్కారు ముఖం చాటేయడంతో ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏపీసీపీఎ్సఈఏ) ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది.
ఆందోళనకు సన్నాహాలు
సీసీఎస్ రద్దు అంశంలో రాష్ట్ర ప్రభుత్వం తమను రెండేళ్లుగా మోసం చేస్తోందని భావిస్తోన్న ఉద్యోగులు, ఉద్యోగు సంఘాల ప్రతినిధులు... పోరాటంతోనే ప్రభుత్వం మెడలు వంచాలని నిర్ణయించారు. 2004 సెప్టెంబరు 1న రాష్ట్రంలో సీపీఎస్ అమలు చేశారు. దీంతో అదే తేదీన తమ నిరసన తీవ్రతరం చేయాలని కార్యాచరణ రూపొందించుకున్నారు. దీనిలో భాగంగా వచ్చే నెల 1న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ’ఫించను విద్రోహ దినం-నయవంచన సభలు’ నిర్వహించాలని ఏపీసీపీఎ్సఈఏ నిర్ణయించింది. ఇప్పటికే వివిధ శాఖల్లో ఉన్న సీపీఎస్ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందిస్తున్నారు. ఇటువంటి నిరసనలతో ప్రభుత్వ పెద్దలకు ఊపిరి ఆడనివ్వడం లేదు. సీపీఎ్సను వెంటనే రద్దు చేసి ఉద్యోగులకు ఇచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకోవాలని పలువురు కోరుతున్నారు
0 Response to "సీపీఎస్పై సర్కారు ఉక్కిరిబిక్కిరి"
Post a Comment