చదువు చుట్టుబండలు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇదీ.. ఎంవీ ఫౌండేషన్‌ - ‘ఈనాడు’ సర్వేలో తేటతెల్లం

విద్యా వ్యవస్థను కరోనా కోలుకోలేని దెబ్బతీసింది. పిల్లల చదువు చట్టుబండలైంది. దాదాపు ఏడాదిన్నర కాలంగా బడి ముఖమే ఎరుగని విద్యార్థులు అభ్యసన సామర్థ్యాలకు దూరమయ్యారు. ఇప్పటి వరకు నేర్చుకున్నవీ మరిచిపోతున్నారు. మూడు, నాలుగు అక్షరాల తేలికైన తెలుగు పదాలనూ తప్పులు లేకుండా రాయలేకపోతున్నారు. ప్రాథమిక స్థాయిలో చాలా మంది విద్యార్థుల పరిస్థితి తెలుగు రాయలేరు.. లెక్కలు చేయలేరు... ఆంగ్లం చదవలేరు అన్నట్లుగా ఉంది. ఎంవీ ఫౌండేషన్‌ సహకారంతో ‘ఈనాడు’ తెలుగు రాష్ట్రాల్లో చేసిన సర్వేలో తేటతెల్లమైన వాస్తవమిది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ విద్యా సంవత్సరం 3-6 తరగతులు చదువుతున్న పిల్లల విద్యా సామర్థ్యాల స్థాయిని నిర్ధారించేందుకు ప్రశ్నపత్రాలిచ్చి సర్వే చేయగా వారి చదువు అధ్వానంగా ఉన్నట్లు బహిర్గతమైంది. సర్వేలో పాల్గొన్న బాలురలో 88 శాతం మంది, 83 శాతం మంది బాలికలు తెలుగులో తేలికైన, గుణింత, ఒత్తు పదాలూ రాయలేకపోయారు. గణితంలో దాదాపు సగం మంది రెండంకెల కూడికలు, తీసివేతలూ 








చేయలేకపోయారు. గుణకారాలు, భాగాహారాలు రానివారు మొత్తంగా 82 శాతం మంది. అబ్బాయిల్లో ఇది 92 శాతం కావడం గమనార్హం. ఆంగ్లంలో బొమ్మల పేర్లు అక్షరదోషాలు లేకుండా రాసినవారు 44 శాతమే ఉండటం విద్యా సామర్థ్యాల దుస్థితికి నిదర్శనం. సొంతగా ఆలోచించి ఒక పేరా తెలుగులోనూ రాయలేకపోతుండటం ప్రధాన లోపంగా కనిపించింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "చదువు చుట్టుబండలు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇదీ.. ఎంవీ ఫౌండేషన్‌ - ‘ఈనాడు’ సర్వేలో తేటతెల్లం"

Post a Comment