మా బడిలో సీట్లు లేవు

సాధారణంగా సినిమా థియేటర్ల దగ్గర హౌస్‌ ఫుల్‌ బోర్డులు కనిపిస్తుంటాయి. ప్రభుత్వ పాఠశాలల ముందు ఇలాంటి బోర్డులు కనిపించడం చాలా అరుదు. విజయనగరం జిల్లా మున్సిపల్‌ హైస్కూల్‌, ప్రాథమిక పాఠశాల గేటు వద్ద ‘మా పాఠశాలలో సీట్లు లేవు’ అన్న బ్యానర్‌ దర్శనమిస్తోంది. విద్యార్థుల చేరిక ఎక్కువగా ఉండటం, అందుకు తగ్గట్టు ‘వసతి’

లేకపోవడంతో ఇలా బ్యానర్‌ కట్టారు. ఉన్నత పాఠశాలలో 490 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ ఏడాది ఆరో తరగతిలో 100 మంది విద్యార్థులు చేరారు. పాఠశాలలో సీట్లు లేవని హెచ్‌ఎం సరోజా రెడ్డి చెప్పారు. ప్రాథమిక పాఠశాలలో 209 మంది విద్యార్థులున్నారు. ప్రాథమిక పాఠశాలలోనూ సీట్లు లేవని పాఠశాల సూపర్‌ వైజర్‌ ధనలక్ష్మి చెప్పారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "మా బడిలో సీట్లు లేవు"

Post a Comment