*💧త్వరలో పిఆర్‌సి అమలు- రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్

*💧త్వరలో పిఆర్‌సి అమలు- రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్* 

 *ప్రజాశక్తి - మార్కాపురం రూరల్ త్వరలో పిఆర్ సి అమలు చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు . పంచాయతీరాజ్ శాఖలో 25 ఏళ్లుగా పరిష్కారం కాని ఎంపిడిఒల ఉద్యోగోన్నతి సమస్యను పరిష్కరించామన్నారు . శనివారం మండల పరిధిలోని మిట్టమీదపల్లిలో ఎపి మోడల్ స్కూల్ ఆవరణంలో ఎంపిడిఒల ఉద్యోగోన్నతులపై విలేకరుల సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ .. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 వేల మంది పంచాయతీరాజ్ శాఖలో వివిధ హోదాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగోన్నతి కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు . వీటితో పాటు పది వేల మంది తెలుగు పండిట్లకు కూడా ఉద్యోగోన్నతి కల్పించామన్నారు* .

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "*💧త్వరలో పిఆర్‌సి అమలు- రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్"

Post a Comment