AP Corona: ఏపీలో కొత్తగా 909 కేసులు..13 మరణాలు

అమరావతి: ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 46,962 నమూనాలను పరీక్షించగా 909 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 19,94,606కి చేరింది. తాజాగా 13 మంది కరోనా మహమ్మారికి బలవ్వగా.. మొత్తం మృతుల సంఖ్య 13,660కి పెరిగింది. 


మరోవైపు 1,543 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జి కాగా.. రాష్ట్రంలో ప్రస్తుతం 17,218 క్రియాశీల కేసులు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,57,08,411 నమూనాలను పరీక్షించినట్లు అందులో పేర్కొంది. తాజాగా చిత్తూరులో ముగ్గురు, గుంటూరు, కృష్ణ, ప్రకాశంలో ఇద్దరు, తూర్పుగోదావరి, కడప, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "AP Corona: ఏపీలో కొత్తగా 909 కేసులు..13 మరణాలు"

Post a Comment