సివిల్ సర్వీసెస్లో 712 ఖాళీలు 2021 నోటిఫికేషన్ జారీ
సివిల్ సర్వీసెస్లో 712 ఖాళీలు
2021 నోటిఫికేషన్ జారీ
ఈనాడు, హైదరాబాద్: దేశంలో అత్యున్నత ప్రభుత్వ కొలువులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తదితర ఖాళీల భర్తీకి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్-2021 నోటిఫికేషన్ను గురువారం విడుదల చేసింది. 2019లో 896, 2020లో 796 ఖాళీల భర్తీకి ప్రకటన జారీ చేయగా.. ఈసారి ఆ సంఖ్య 712కి తగ్గిపోయింది. సాధారణంగా 23 లేదా 24 శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తారు. ఈసారి 19 శాఖల్లోనే భర్తీ చేయనున్నారు. సివిల్స్ నుంచి రైల్వే సర్వీసెస్ను తొలగించారని.. వాటిని రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉందని సివిల్స్ శిక్షణ నిపుణుడు గోపాలకృష్ణ తెలిపారు. సివిల్ సర్వీసెస్-2021 ప్రాథమిక పరీక్ష జూన్ 27న జరగనుంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఏటా దాదాపు 90 వేల మంది దరఖాస్తు చేస్తున్నారు
0 Response to "సివిల్ సర్వీసెస్లో 712 ఖాళీలు 2021 నోటిఫికేషన్ జారీ"
Post a Comment